BR Ambedkar: అంబేద్కర్‌ ఆలోచనలే మాకు ప్రేరణ.. ఘన నివాళ్లు అర్పించిన సీఎం రేవంత్!

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆలోచనలనే తమకు ప్రేరణ అని చెప్పారు. ఆయన స్ఫూర్తితో  తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

New Update
ambedkar cm rvnt

CM Revanth Reddy tributes on Ambedkar Jayanti

BR Ambedkar: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలనే తమకు ప్రేరణ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఈ మేరకు నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం ఘన నివాళులు అర్పించారు.

ప్రపంచానికి ఆదర్శం..

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. అట్టడుగు వర్గాలకు అవకాశాల కోసం అంబేద్కర్‌ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య, రాజీవ్ యువ శక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

అంబేద్కర్ వల్లే తెలంగాణ..

బలహీన వర్గాలు, మహిళల సాధికారత కోసం అంబేద్కర్ అవిశ్రాంతంగా కృషిచేశారని గుర్తు చేశారు. దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని పొగిడారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేద్కర్‌ రాజ్యాంగమేనని అన్నారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు. దళితుల అభ్యున్నతిలో తెలంగాణ రాష్టం దేశానికి మార్గదర్శకంగా నిలపడగమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. 

Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

cm-revanth | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్‌ అలర్ట్‌

ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోవాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
Heatwave Warning

Heatwave Warning


Heatwave Warning : ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ర్టాల్లో వాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ర్టాల్లోనూ ఈ రోజు  ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయిని అధికారులు పేర్కొన్నారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

శనివారం, ఆదివారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో రాత్రి పూట వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరినగర్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల రెండు రోజులు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 44.6, కనిష్టంగా హైదరాబాద్ లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!


మరోవైపు రాత్రి సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

ఇక ఏపీలోను భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అవకాశం ఉంది.శనివారం ఏపీలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, లక్ష్మీనరసుపేట, పాతపట్నం, విజయనగరం జిల్లా సంతకవిటి, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, పాలకొండ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి.. శ్రీకాకుళం-1, విజయనగరం-15, పార్వతీపురంమన్యం-9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.. మరో 28 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం కనిపించనుంది. ఆదివారం నాలుగు మండలాల్లో తీవ్ర, 17 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉరుములతో కూడిన అకాల వర్షాలు పటేడప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది.

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

Advertisment
Advertisment
Advertisment