TG Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ ఉండదు.. ఢిల్లీలో సీఎం రేవంత్ షాకింగ్ ప్రకటన!

మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రుల తొలగింపు.. కొత్త వారికి చోటు హైకమాండ్ నిర్ణయం ప్రకారమే ఉంటుందన్నారు. రేపు లేదా ఎల్లుండి పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందన్నారు.

New Update
Telangana Cabinet Expansion CM Revanth Reddy

Telangana Cabinet Expansion CM Revanth Reddy

తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లేనని సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రివర్గంలో తీసివేతలు, కూడికలపై హైకమాండ్ దే నిర్ణయమని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళతామన్నారు. తనకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానన్నారు. కుల గణన ఆషామాషీగా చేసింది కాదన్నారు. ఎంతో పకడ్బందీగా చేశామన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని.. ఈరోజు లేదా రేపు ప్రకటన ఉంటుందని తెలిపారు. తాను రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదన్నారు. తనకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందన్నారు. 
ఇది కూడా చదవండి: TG Politics: పద్దతి మార్చుకో రేవంత్.. ఎమ్మెల్యేల ముందే క్లాస్ పీకిన రాజగోపాల్ రెడ్డి!

డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోకి 11 మందిని మాత్రమే తీసుకున్నారు. ఈ సమయంలో నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చోటు దక్కలేదు. అయితే.. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆ సమయంలో సీఎం ప్రకటించారు. కానీ ఏడాది దాటినా ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ కార్యరూపం దాల్చలేదు. దీంతో మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు ఇప్పటికే అసమ్మతి గళం విప్పడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పడం సంచలనంగా మారింది. ఈ ప్రకటనపై మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న వారు ఎలా రియాక్ట్ అవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: CLP Meeting: ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే.. గీత దాటితే ఊరుకునేది లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అగ్ర నేతల వార్నింగ్!

విస్తరణకు బ్రేక్ అందుకేనా?

మంత్రి వర్గ విస్తరణ పూర్తి చేస్తే చోటు దక్కని వారు పంటి కింద రాయిలా మారుతారని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారి ఆశలు సజీవంగా ఉంచేందుకే విస్తరణ పూర్తి చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల పది మంది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్, ఢిల్లీకి వెళ్లి మరి జూపల్లి కంప్లైంట్ ఇవ్వడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో తేనె తుట్టెను కలపడం ఏ మాత్రం సరికాదనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment