/rtv/media/media_files/2025/02/26/DHBxIDJLmUhAmelqEnqg.jpg)
slbc Photograph: (slbc)
పద్నాలుగు రోజులు అవుతోంది కానీ ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల జాడ మాత్రం ఇంకా తెలియలేదు. కూలిన టన్నెల్ లో కార్మికులందరూ చనిపోయారని తెలుసుకోగలిగారు కానీ వారి మృతదేహాలను మాత్రం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేకపోయారు. దీంతో నిన్నటి నుంచి అక్కడ సహాయక చర్యలను మింత ముమ్మరం చేశారు. నిన్న క్యాడవర్ డాగ్స్ బృందాన్ని తీసుకువచ్చారు. ఈరోజు టన్నెల్ ను తవ్వేందుకు అవసరమైన సామాగ్రిని లోకో మోటర్ తీసుకెళ్లింది. దాంతో పాటూ 110 మంది సిబ్బంది కూడా లోపలికి వెళ్ళారు. అన్వేషణ తర్వాత ఈ బృందం మధ్యాహ్నం టన్నెల్ నుంచి తిరిగి రానుంది. సంఘటనా స్థలిలో పరిస్థితులను నాగర్కర్నూల్ కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.
క్యాడవర్ డాగ్స్...
నిన్న కార్మికుల జాడ కనుగొనేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను రప్పించారు. ఇందుకోసం కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లలో రెండు క్యాడవర్ జాగిలాలను తీసుకువచ్చారు. కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్ను టన్నల్ వద్దకు రప్పించారు. 8 మందిని గుర్తించేందుకు క్యాడవర్ డాగ్స్ను తెప్పించినట్లు అధికారులు తెలిపారు. కేరళ ప్రత్యేక పోలీసు బృందం, జిల్లా కలెక్టర్ సంతోష్.. విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమయ్యారు. 8మంది చిక్కుకున్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో సమస్యాత్మకంగా మారిన బురద, మట్టిని తొలగించేందుకు అధికారులు తొలిసారి వాటర్ జెట్లను వినియోగిస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కనుగొనేందుకు అధికారులు 13 రోజులుగా చేస్తున్న కృషి ఫలించడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైన్స్, హైడ్రా తదితర ఏజెన్సీల నిపుణులు బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఫలితం తేలకపోవడంతో తొలిసారిగా వాటర్ జెట్లను వినియోగిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషిన్(టీబీఎం)పైన, చుట్టుపక్కల పేరుకుపోయిన బురదపై వీటితో నీటిని పంప్ చేస్తున్నారు.
Also Read: Singer Kalpana: నా భర్తతో నాకేం గొడవలు లేవు..సింగర్ కల్పన వీడియో
Anugula Rakesh Reddy : ఆ నేరం మళ్లీ మళ్లీ చేస్తా….రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం నోటీసులు జారీ చేసింది. స్పందించిన రాకేష్ రెడ్డి అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తానన్నారు.
Anugula Rakesh Reddy
Anugula Rakesh Reddy : టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ(TGPSC) పరువునష్టం దావా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో స్పందించిన రాకేష్ రెడ్డి అంతే గాటుగా సమాధానమిచ్చారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..టీజీపీఎస్సీ నోటీసులకు త్వరలోనే సమాధానం ఇస్తానని అన్నారు.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
ఈ సందర్భంగా ఆయన.. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తానని అన్నారు. జైల్లో బంధిస్తే జైలు గోడల మీద నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించిన కవి దాశరథి గారు పుట్టిన ఓరుగల్లు నేల పై పుట్టిన బిడ్డను తనని, ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. గ్రూప్ -1 పరీక్షల్లో జరిగిన అవకతవలకు పై ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని సహేతుకంగా ప్రశ్నించినందుకు నాపై పరువునష్టం దావా వేశారని తెలిపారు. ప్రశ్నిస్తేనే మీ పరువు పోతే మరి, మీవల్ల జరిగిన అవకతవకల వల్ల జీవితాలను కోల్పోతున్న నిరుద్యోగులు ఏం చేయాలి? అని సూటిగా ప్రశ్నించారు. అంతేగాక గతంలో నేడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇదే టీఎస్పీఎస్సీ పైన రోడ్డెక్కి ఎన్నో విమర్శలు చేశారని, మరి అప్పుడెందుకు ఇలాంటి నోటీసులు ఇవ్వలేదు..? అని నిలదీశారు.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
బీఆర్ఎస్ పార్టీకి, నాయకత్వానికి కేసులు కొత్తకాదు.. పోరాటం కొత్తకాదు.. ఆ స్ఫూర్తితోనే విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతామని, మీ ఇజ్జత్ దావాకు ఇగురంగానే త్వరలోనే సమాధానం ఇస్తాను అని రాకేష్ రెడ్డి రాసుకొచ్చారు. కాగా ఇటీవల విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఆరోపణలపై సీరియస్ అయిన టీజీపీఎస్సీ రాకేష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. టీజీపీఎస్సీపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని, లేకుంటే పరువు నష్టం, క్రిమినల్ కేసులు దాఖలు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది.ఇకపై భవిష్యత్తులో టీజీపీఎస్సీపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆంక్షలు విధించింది.
Also Read: గుజరాత్కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్రౌండర్ ఔట్!
USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు
AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…
Ontimitta Kodandaramundu : వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం
Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్