SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో మద్రాస్ IIT రోబోలు

SLBC టన్నెల్‌లో ప్రమాద స్థలానికి 20 మీటర్ల దూరంలో రెస్క్యూకు ఆటంకం కలుగుతుంది. దీంతో రోబోల సాయంతో పనులు ప్రారంభించారు. మద్రాస్ ఐఐటీకి చెందిన అన్వి రోబో టీం టన్నెల్ వద్దకు చేరుకుంది. మంగళవారం సాయంత్రంలోగా మరో ఇద్దరి మృతదేహాలు వెలికి తీయనున్నారు.

New Update

SLBC టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల బృందాలు ప్రమాద స్థలానికి 20 మీటర్ల దూరం చేరుకున్నారు. శిథిలాలు, TBM మెషిన్‌ భాగాలను బయటకు తీసుకొస్తున్నారు. సహాయక చర్యలకు  ఆటంకం కలుగుతుండటంతో రోబోల సాయంతో పనులు ప్రారంభించారు. మద్రాస్ ఐఐటీకి చెందిన అన్వి రోబో టీం టన్నెల్ వద్దకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం వరకు మరో ఇద్దరు కార్మికుల ఆచూకీ తెలుస్తోందని అధికారుల తెలిపారు. 

Also read: Mom sit on son: ఆడుతూ.. ఆడుతూ కొడుకు మీద కూర్చుంది.. బాలుడి ప్రాణం తీసిన తల్లి సరదా

ప్రమాద స్థలంలో 20 మీటర్ల మేరా సొరంగం కుంగింది.. దీంతో కార్మికులు ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రోబోలను రంగంలోకి దించింది. మద్రాస్ ఐఐటీ నుంచి ఓ టెక్నికల్ టీం రోబోలతోపాటు సొరంగంలోకి వెళ్లారు. శిథిలాలు, మట్టి, బురదను రోబోలు లోకో ట్రైన్‌లో డంప్ చేయనున్నాయి. కాగా నిన్న టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే.

Also read: girl water fasting: ఆరు నెలలుగా నీళ్లు మాత్రమే తాగిన యువతి మృతి.. ఎందుకంటే..?

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.

New Update
cm revanth tg

Telangana CM Revanth Reddy lunch in fine rice beneficiary home

TG News: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఉదయం భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 

10 లక్షల కొత్త రేషన్‌కార్డులు..

ఇక రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మార్చి 30న ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో వీరు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. అలాగే దాదాపు10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారన్నారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

2024లో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

 ration rice | cm revanth | khammam | telugu-news | today telugu today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment