SLBC: టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం.. లోపల భరించలేని దుర్వాసన!

SLBC టన్నెల్‌లో మరో మృతదేహం దొరికింది. ప్రమాద ఘటనలో కన్వేయర్ బెల్టుకు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీని గుర్తించారు. బాడీ మొత్తం కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
slbc

SLBC tunnel Rescue Operation

SLBC: SLBC టన్నెల్‌లో మరో మృతదేహం దొరికింది. ప్రమాద ఘటనలో కన్వేయర్ బెల్టుకు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీని గుర్తించారు. బాడీ మొత్తం కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. నెల రోజుల క్రితం టన్నెల్లో 8 మంది చిక్కుకోగా ఇటీవల ఓ ఇంజినీర్ డెడ్ బాడీని వెలికితీసిన విషయం తెలిసిందే. కాగా మరో 6 గురి ఆచూకి లభించాల్సివుంది. 

భరించలేని దుర్వాసన..

TBM మిషన్ శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించినట్లు రెస్క్యూ బృందం తెలిపింది. మరో ఆరుగురి కోసం తవ్వకాలు చేపట్టామని, గ్యాస్ కట్టర్‌లతో శిథిలాల కటింగ్ చేస్తున్నట్లు రెస్క్యూ టీమ్స్ చెప్పింది. టన్నెల్ లోపల భరించలేని దుర్వాసన వస్తోందని, దీంతో స్ప్రే బాటిల్స్‌తో లోపలికి వెళ్లిన ఆపరేషన్ చేపడుతున్నట్లు రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి.  మినీ హిటాచితో తవ్వకాలు జరుపుతుండగా కార్మికుడి మృతదేహం ఆనవాళ్లు బయటపడ్డట్లు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?

 రెస్క్యూ ఆఫరేషన్‌లో భాగంగా టీబీఎం బేస్, ఇతర విడిభాగాలను గ్యాస్​ కటర్లతో తొలగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్​ హోల్​ మైనర్లు డ్రిల్లింగ్​ చేసి మట్టిని తవ్వుతున్నారు. కన్వేయర్​ బెల్ట్​ అందుబాటులోకి వస్తే దానిపై వేసేలా రాళ్లను పగలగొడుతున్నారు. లోకో ట్రాలీల వరకు కట్​ చేసిన విడిభాగాలు, మట్టిని, రాళ్లను మోస్తున్నారు.13.500 కిలోమీటర్ల తర్వాత సీపేజీ​సమస్య ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో 5 పంపులు కంటిన్యూగా పని చేస్తున్నా నీటి ఉధృతి తగ్గడం లేదంటున్నారు. 

Also Read: మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి...

 dead-body | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HCU వివాదంపై సర్కార్ సంచలన ప్రకటన!

HCU వివాదంపై రేవంత్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కొందరు దీనిపై దుష్ప్రాచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. యూనివర్సిటీ భూములు తీసుకోవట్లేదని, పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జీవవైవిద్యానికి నష్టం కలిగించమన్నారు.

New Update
hcu

HCU Hyderabad

HCH:HCU వివాదంపై రేవంత్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కొందరు దీనిపై దుష్ప్రాచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. యూనివర్సిటీ భూములు తీసుకోవట్లేదని, పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జీవవైవిద్యానికి నష్టం కలిగించమన్నారు. గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని చెప్పారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్‌ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందన్నారు. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందినది లేదన్నారు.

వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే..

ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. ప్రభుత్వం ఇక్కడ చేపట్టే ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా రాజకీయ నాయకులేనని, కొందరు స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘2003 జనవరి 13న నాటి ప్రభుత్వం ఐఎంజీ అకడమీస్‌ భారత ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మెమో నం.39612/ఏఎస్‌ఎస్‌ఎన్‌/వి(2) 2003 ప్రకారం కంచ గచ్చిబౌలి గ్రామంలోని భూమిని కేటాయించింది. ఆ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబరు 21న కేటాయింపును రద్దు(నం.111080/ఎస్‌1/2003) చేసి ఏపీ యూత్‌ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్‌ కల్చరల్‌ డిపార్ట్‌మెంటుకు కేటాయించింది' అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

మరోవైపు ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. మరోవైపు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

 

 

: land | cm revanth | sridhar-babu | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment