women's day celebrations : మహిళా జర్నలిస్టులకూ లైంగిక వేధింపులు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

మహిళా జర్నలిస్టులకూ లైంగిక వేధింపులు తప్పటం లేదని మంత్రి సీతక్క వాపోయారు. హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులు, జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

New Update
Seethakka

DANASARI ANASUYA SEETHAKKA

women's day celebrations : మహిళా జర్నలిస్టులకూ లైంగిక వేధింపులు తప్పటం లేదని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులు, జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ  ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క..మహిళలకు  అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల కష్టాలు తీర్చేందుకు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాడు మహిళా దినోత్సవం ఆవిర్భవించిందన్నారు. 

ఇది కూడా చూడండి: Champions Trophy:  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..

ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారన్నారు. శ్రామిక మహిళల శ్రమకు తగిన గుర్తింపు నిచ్చే విధంగా మహిళలు ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకున్నారన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ రకరకాల వివక్షతను అన్ని రంగాల్లోనూ మహిళలు ఎదుర్కొంటున్నారన్నారు. వివక్షతను రూపుమాపేందుకు మన ఆలోచించే విధానాల్లో మార్పు రావాలన్నారు. మహిళలకు తగిన గుర్తింపును ఇచ్చే విధంగా సమాజంలోనూ మార్పు రావాలన్నారు. ప్రతి ఇంట్లో ఆడవారి పట్ల గౌరవం ఇచ్చే విధంగా పిల్లలకు నేర్పించాలని సూచించారు.

ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, వైద్యం కోసం కొత్త పాలసీని తీసుకురానున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడుతానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్న సీతక్క జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వ పాటుపడుతుందన్నారు. మహిళా జర్నలిస్టులు యజమానులుగా ఎదగాలని సూచించారు. మహిళా జర్నలిస్టులకు కూడా లైగింక వేధింపులు తప్పడం లేదని మంత్రి సీతక్క వాపోయారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే పద్ధతిని మొదలు పెట్టింది అంజయ్య అని వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా జర్నలిస్టులను మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు.

ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment