Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!

చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

New Update
rsp maoist

rsp maoist Photograph: (rsp maoist)

Maoist: కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు ఒప్పుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చర్చలు జరపాలన్నారు. భారతదేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులను చంపడం అత్యంత నేరమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో స్పష్టంగా ఉంది. కావున ఈసారి జరగబోయే చర్చలు 2004లో లాగా కాకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే బాగుంటుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధం..

అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. స్థానికులకే సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ లో ఉన్న సమస్యల కోసం ఆగిపోయిన అభివృద్ధి కోసం ధర్నాలు రాస్తారోకోలు మేమే చేస్తున్నాం. రాష్ట్రంలో HCU భూములను దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి భూముల అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ మందు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ పని భూములమ్ముకోవడమే. 27 న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని కోరారు. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

rs-praveen | amithsha | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket Betting : బెట్టింగ్ భూతానికి యువకుడు బలి..

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కొంతమంది. వ్యసనంగా మారి మరికొందరు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఏం చేయలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ రాక్షసి మరో యువకుడ్ని మింగేసింది.

New Update
A young man falls victim to the betting craze..

A young man falls victim to the betting craze..

IPL Betting: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కొంతమంది. వ్యసనంగా మారి మరికొందరు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఏం చేయలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ రాక్షసి మరో యువకుడ్ని మింగేసింది. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న ఓ యువకుడు బెట్టింగ్ లో సర్వం పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్‌ టికెట్లు!
 
ఒకవైపు రోజు మీడియాలో బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న అనర్థాలను చూస్తున్నప్పటికీ యువత ఆ మార్గం నుంచి బయట పడడం లేదు. బెట్టింగ్ యాప్స్ బారిన పడి యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ఈజీ మనీ ఆశతో చాలా మంది డబ్బులు, ఆస్తులు పొగొట్టుకొని, ఆర్థిక ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ యువకుడు బెట్టింగ్ కారణంగా అన్ని పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్నాడు. గణేష్ అనే 26 ఏళ్ల యువకుడు మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎంఏ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న గణేష్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: వంటలో ఈ మూడు పదార్థాలు వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు
 
క్రికెట్ బెట్టింగ్ కారణంగానే గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గణేష్ లోన్ యాప్స్, ఫ్రెండ్స్ వద్ద అప్పులు చేసి బెట్టింగ్ లు పెట్టేవాడని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం కూడా అతడి సూసైడ్‌కు కారణాలని పోలీసులు అంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!

Advertisment
Advertisment
Advertisment