KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డిది సిగ్గు ,లజ్జ లేని బతుకు...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి రేవంత్ రెడ్డికి ఎలాంటి పట్టింపు లేదు. ఎన్నికల తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంపాదించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

New Update
KTR

KTR

KTR vs Revanth Reddy: రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి రేవంత్ రెడ్డికి ఎలాంటి పట్టింపు లేదు. ఎన్నికల తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంపాదించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్ రెడ్డిది సిగ్గు ,లజ్జ లేని బతుకు కాబట్టే తెలంగాణ ప్రజలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నా కూడా పట్టించుకోకుండా ఉంటున్నడని ఎద్దేవా చేశారు. ఈరోజు ఆమ‌న్‌గ‌ల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

Also Read : నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్‌ రాయల్ సంచలన ఆడియో!

420 దొంగ హామీలు ఇచ్చి నంగనాచి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు.కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఎవరికి న్యాయం చేయలేదు. అక్కడ ఎవరికి రైతుబంధు రాలేదు. రుణమాఫీ కాలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వలేదు. ఆడబిడ్డలకు 2500 రూపాయలు కూడా ఇవ్వలేదు. సొంత నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదు. పుట్టి పెరిగిన పిల్లనిచ్చిన కల్వకుర్తి ప్రాంతానికి కూడా ఒక్క రూపాయి పని చేయలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాజు లాగా రైతు ఎవరి దగ్గర చేయి చాపకుండా బ్రహ్మాండంగా బతికిండు. పదేళ్లు మోటార్లు కాలలేదు. ట్రాన్స్ఫార్మర్లు పేలలేదు. పదేళ్లు రైతులు ఎవరి దగ్గర అప్పులు అడిగే పరిస్థితి లేకుండే. నాట్లేసే టైం కి టింగు టింగు మని రైతుబంధు పైసలు పడుతుండేనని కేటీఆర్‌ గుర్తు చేశారు.

Also Read :  పచ్చి బొప్పాయి రసంలో పుష్కలంగా విటమిన్లు..ఎన్నివ్యాధులను నయం చేస్తుందో తెలుసా!

టకీ టకీ మని రైతు భరోసా ఇస్తనని రేవంత్ రెడ్డి గప్పాల్ కొట్టిండు. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్ కంటే ఎక్కువగా రైతు భరోసా 15000 ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ 10 శాతం మంది రైతులకు కూడా ఇవ్వలేదు. సోనియా జన్మదినం సందర్భంగా రుణమాఫీ ఒకేసారి రెండు లక్షలు చేస్తానని చెప్పిండు. కానీ ఇప్పటివరకు చారన రుణమాఫీ కూడా చేయలేదని ఆరోపించారు.
500 బోనస్ 10 శాతం మందికి కూడా పడలేదు. ఆడబిడ్డలకు అరచేతిలో స్వర్గం చూపించిండు.పిల్లనిచ్చిన అత్తగారి ప్రాంతంలోనీ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రతినెలా 2500 రూపాయలు ఇస్తున్నాడేమో అనుకున్నా. అయితే అత్తగారి ప్రాంతాన్ని కూడా మోసం చేసిండని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Also Read :  ప్రియాంక చోప్రాకు ఈ తీవ్రమైన వ్యాధి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

ఈ 14 -15 నెలలు 35 సార్లు ఢిల్లీకి చెక్కర్లు కొట్టడంతోనే రేవంత్ రెడ్డికి సరిపోయింది. కానీ ఢిల్లీ నుంచి 35 పైసలు కూడా తేలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్స్ మైగ్రేషన్ తో వేరే రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వచ్చి పనిచేసేవారు. మొన్న తలుపులు ఎత్తుకుపోయిండు. నిన్న స్టార్టర్లు ఎత్తుకుపోయిండు. ఇక రేపు మీ పుస్తెలతాడు కూడా రేవంత్ రెడ్డి ఎత్తుకుపోతడని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దొంగ అని ఎలక్షన్ల ముందు చెప్పినం. తెలంగాణ మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసాన్ని తెలుసుకుందన్నారు.రైతుకు కులం లేదు మతం లేదు. 70 లక్షల మంది రైతులను కేసీఆర్ గారు పదేళ్లు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. రూ. 73000 కోట్ల రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ భారత దేశంలో కేసీఆర్ ఒక్కరేనని కేటీఆర్‌ తెలిపారు.

Also Read :  దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!

బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు- కేటీఆర్

స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతు చనిపోతే అతని కుటుంబానికి 5 లక్షల భీమా ఇచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్..మేనమామ లెక్క ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో లక్ష రూపాయలు ఇచ్చిండు. 200 రూపాయల పెన్షన్ ను పదిరెట్లు పెంచి 2000 రూపాయలు చేసిండు కేసీఆర్ అని వివరించారు. రేవంత్‌ రెడ్డి నిజాయితీ గల మోసగాడని కేటీఆర్‌ ఆరోపించారు. 42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. రైతు భరోసా రూ.15000 ఇస్తానని అన్నదాతలను మోసం చేసిండు.రూ.12000 ఇస్తానని రైతు కూలీలను మోసం చేసిండు.నెలకు 2500 ఇస్తానని ఆడబిడ్డలను మోసం చేసిండు.చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నాడు. లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తా అనీ వాళ్లను మోసం చేసిండు. ఇలా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి విజయవంతంగా మోసం చేస్తూనే ఉన్నాడన్నారు.

Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?

కాంగ్రెస్ 420 పాలనలో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గురుకుల పాఠశాలలను నడపడం చేతకాని సన్నాసి రేవంత్ రెడ్డి. ఇప్పటికీ 56 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం విషాదకరం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకొని తెలంగాణ ప్రజలు నిలదీయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Also Read: దక్షిణ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 31 మంది మృతి

 
 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment