TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !

మణుగూరు ప్యాసింజర్‌ రైలులో రమణమ్మను హరియాణకు చెందిన రోహిత్‌ అనే వ్యక్తి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. హత్య చేసి పర్సులో రూ. 25 వేలు నగదు, రైలు టికెట్‌, ఫోన్‌ తీసుకుని పరారయ్యాడు. ఇప్పటి వరకు ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు అంగీకరించాడు నిందితుడు.

New Update
pakala beach

TG crime

TG crime: మణుగూరు రైలులో మహిళ దారుణ హత్య జరిగింది. కూతురును చూసేందుకు మణుగూరు ప్యాసింజర్‌ రైలులో ప్రయాణం చేస్తున్న మహిళ రైల్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దివ్యాంగుల బోగీలోని బాత్‌రూంలో మెడ చుట్టూ తువ్వాలు బిగించి ఊపిరాడకుండా చేసి ఓ దుండగుడు చంపాడు. ఈ ఘటనపై విచారణ చేసిన పోలీసులు నిందితులు గుర్తించి పట్టుకున్నారు. అయితే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు అత్యాచారం చేసి, చంపేసి.. మృతదేహంపై ఉన్న విలువైన వస్తువులు తీసుకుని పరారవుతాడని పోలీసుల విరాచణలో తేలింది. మృతురాలి రమణమ్మకు భర్త గోవిందప్ప ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. బతుకుదెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితమే కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సింపోటు మండలం తోర్నగల్‌లో రమణమ్మ కుటుంబం స్థిరపడింది. పెద్ద కుమార్తె హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఉంటోంది. 

బాత్‌రూం డోర్‌ తీసి చూడగా రమణమ్మ మృతదేహం:

కూతురుని చూసేందుకు రమణమ్మను నవంబర్‌ 23న రాత్రి 7 గంటలకు బయల్దేరింది. బళ్ళారి దగ్గర తోర్నగల్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర మణుగూరు ప్యాసింజర్‌ రైల్లోని మహిళల బోగీలోకి కొడుకు ఎక్కించాడు. వెంటనే హైదరాబాద్‌లో ఉంటున్న బావ వెంకటేశ్‌కు ఫోన్‌ చేసి సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆమెను రిసీవ్‌ చేసుకోవాలని చెప్పాడు. నవంబర్‌ 24 ఆదివారం ఉదయం ఆ రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అయితే అప్పటికే అల్లుడు వెంకటేష్‌ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చుస్తూ ఉన్నాడు. రైలు వెనుక భాగంలో ఉన్న మహిళల బోగిలో అత్త కోసం చూడగా కనిపించలేదు. దీంతో పక్కనే దివ్యాంగుల బోగిలో బాత్‌రూం డోర్‌ తీసి చూడగా అత్త రమణమ్మ మృతదేహం కనిపించింది. వెంటనే వెంకటేష్‌ లోకో పైలట్‌కు, సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చాడు. ప్రమాదంపై స్పందించిన రైల్వే పోలీసులు మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు. 

Also Read: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం

ఒంటరి మహిళలను లక్ష్యంగా..

రమణమ్మను హరియాణకు చెందిన రోహిత్‌ అనే వ్యక్తి హత్య చేసినట్లు తెలిసింది. హత్య జరిగిన వెంటనే నిందితుడు బళ్ళారి నుంచి సికింద్రాబాద్‌ మధ్యలో తిరిగి పలు రైళ్లు మారి గుజరాత్‌కి పారిపోయ్యాడు. గుజరాత్‌ రైల్వే పోలీసులు తనిఖీల్లో బాగంగా అనుమానాస్పద స్థితిలో నిందితుడు తిరుగుతుండగా పట్టుకుని స్టేషన్‌ తీసుకేళ్లారు. అక్కడ పూర్తిస్థాయిలో విచారించగా హతకుడు అతడేనని తేలింది. అంతేకాకుండా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని హత్య చేయటంతోపాటు రేప్‌చేసి హత్య చేసినట్లు విచారణలో రోహిత్‌ అంగీకరించాడు. ఇప్పటిదాకా కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ ప్రాంతాల్లో ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. హత్య చేసిన రమణమ్మ మెడలో బంగారాన్ని దొంగ ముట్టుకులేదు కానీ ఆమె పర్సులో ఉన్న 25 వేలు నగదుతోపాటు.. బళ్ళారి నుంచి సికింద్రాబాద్‌ రైలు టికెట్‌, ఫోన్‌ను తీసుకున్నాడు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం

Also Read: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు మూడు చోట్ల..

Also Read: పాపం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు వైద్యులు మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment