Rains: తెలంగాణలో మూడు రోజులు పాటు వానలు..అలెర్ట్‌ ప్రకటించిన ఐఎండీ!

తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

author-image
By Bhavana
New Update
ap rains

Telsngana: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 21న నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల,  జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది.

ఈదురుగాలులు వీచే...

ఈ నెల 22న నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌,  సంగారెడ్డి, మెదక్‌, మహబూబాబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. 23 న కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, , జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడతాయని వివరించింది. 

ఎల్లో హెచ్చరికలు...

ఈ మేరకు మూడురోజులు ఆ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. మొన్నటి వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని భారత వాతావరణశాఖ వివరించింది. 

Also Read :  ఆందోళన విరమించిన జూడాలు..శనివారం నుంచి విధుల్లోకి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్.. ఆరుగురు విద్యార్థులు సూసైడ్

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Death

Death

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అశ్విని కి తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపంతో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది.

Also Read: పహల్‌గామ్ ఉగ్రదాడికి సూత్రధారి వీడే .. లష్కరే తోయిబా టాప్ కమాండర్!

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి  చెందిన ఓ విద్యార్థి స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదివాడు. రిజల్ట్స్ చూసుకోగా ఫెయిలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు సమీపంలో అవంతినగర్‌కు చెందిన ఓ విద్యార్థి బల్కంపేటలోని ఇంటర్ ఫస్టియర్ చదివాడు. 

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆవేదనకు గురయ్యాడు. సాయంత్రం ఎవరూ లేని సమయాన్ని చూసి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక నాగోలు తట్టిఅన్నారం వైఎస్‌ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్‌ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యింది. ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఉరేసుకొని సూసైట్ చేసుకుంది. 

Also Read: విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్‌.. నేడు జేడీ వాన్స్‌!

బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్న సుమతి, రామకృష్ణ కూతురు నిష్ఠ.. ఇంటర్‌ ఫస్టియర్ చదవింది. అయితే కెమిస్ట్రీలో ఫెయిల్‌ కావడంతో బలవన్మరణానికి పాల్పడింది. మేడ్చల్‌ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన విద్యార్థిని  కార్పొరేట్ కాలేజ్‌లో ఇంటర్ చదివింది. సెకండియర్‌లో అనుకున్న మార్కులు రాలేదని సూసైడ్ చేసుకుంది. 

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

telugu-news | rtv-news | national-news | inter-results | suicide 

Advertisment
Advertisment
Advertisment