ఖమ్మంలో కన్నీరు పెట్టించే ఘటన.. గ్రూప్-3 ఎగ్జామ్ రాసి వస్తున్న తల్లి వైపు పరిగెత్తుతూ..!

గ్రూప్‌-3 పరీక్ష రాసి వస్తున్న తల్లిని చూసిన చిన్నారి అమ్మొచ్చిందంటూ సంబరపడింది. తల్లిని హత్తుకునేందుకు గుమ్మం వైపు పరుగు తీసింది. కానీ అమ్మను చేరక ముందే ఆ బిడ్డ గుండెపోటుతో కుప్ప కూలింది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

New Update
sujathnagar apartment

Khammam

TG Crime: ఖమ్మం జిల్లా గ్రామీణ మండల పరిధిలో విషాద కర ఘటన చోటుచేసుకుంది. ఎంవీపాలెం గ్రామానికి లావణ్య సోమవారం గ్రూప్‌ 3 పరీక్ష రాసేందుకు వెళ్లింది. పరీక్ష రాసి వెళ్లిన తల్లి తిరిగి ఇంటికి రావడం చూసిన చిన్నారి అమ్మొచ్చిందంటూ సంబరపడింది. తల్లిని హత్తుకునేందుకు ఇంటి గుమ్మం వైపు పరుగు తీసింది. ఆమె కుడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది. అమ్మను చేరక ముందే ఆ  బిడ్డ ఒక్కసారిగా కుప్పకూలింది.

ఇది కూడా చదవండి: నిమ్మకాయను ఇలా వాడితే అజీర్తి సమస్య ఉండదు

ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల్లో ప్రాణాలు..

తల్లిదండ్రులు కథనం ప్రకారం.. ఎంవీపాలెం గ్రామానికి చెందిన కుర్ర వినోద్, లావణ్య దంపతులు ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. వారికి ఏకైక కుమార్తె ప్రహర్షిక (4) ఉంది. సోమవారం తల్లి లావణ్య గ్రూప్‌-3 పరీక్ష రాసేందుకు వెళ్తుండగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల దగ్గర వదిలి వెళ్లింది. పాప వాళ్ల దగ్గరే ఆడుకుంటూ ఉంది. పరీక్ష రాసి మధ్యాహ్నం ఇంటి వస్తున్న తల్లిని చూసి చిన్నారి ఒక్కసారిగా  అమ్మ ఒడికి చేరాలని పరుగు పెట్టింది. ఇంతలో ఏమైందో గాని.. ఒక్కసారిగా చిన్నారి కిందపడిపోయింది.

Also Read: హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఈసారి ఆ సంస్థతో కలిసి 

తల్లిదండ్రులు కంగారుతో ఏమైందని అడిగితే.. ఛాతీ దగ్గర నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి వెళ్లింది. వెంటనే ఆర్‌ఎంపీ డాక్టర్‌ దగ్గరకు ప్రాథమిక వైద్యం చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లలు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. అయితే.. చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. ఎప్పుడూ చలాకీగా ఆడుతూ ఉండే బిడ్డ ఉన్నట్లుండి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

 

ఇది కూడా చదవండి: నిజామాబాద్‌లో హైటెన్షన్.. మేయర్ భర్తపై సుత్తెతో దాడి!

 

Also Read: Rahul Gandhi: కులగణనపై రాహుల్‌గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment