తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రానున్న రెండు రోజులు.. పాటు బుధవారం, శుక్రవారం భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Also Read: Mujra Party : మొయినాబాద్లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!
IMD విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, హన్మకొండ జిల్లాల్లో ఏప్రిల్ 9వ తేదీన ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.అంతేకాకుండా.. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు.
Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు
Telangana Rain Alert
ఈదురుగాలుల వల్ల చెట్లు విరిగిపడే అవకాశం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు సురక్షితమైన చోటుకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. నిన్న హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రానున్న వర్షాల నేపథ్యంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను సూచిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల తర్వాత ఒక్కసారిగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ప్రజలు ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక నిజామాబాద్ జిల్లాలో వాతావరణంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాదాపు ఐదు రోజుల క్రితం ఈ జిల్లాలో బలమైన ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీని ఫలితంగా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే.. వారం రోజుల పాటు చల్లగా ఉన్న వాతావరణం ఆదివారం నుండి మళ్లీ వేడిగా మారుతుంది. గత మూడు రోజులుగా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. అయితే.. రానున్న వర్ష సూచనతో నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనపడుతున్నాయి.
వాతావరణ శాఖ ఈ హెచ్చరికల నేపథ్యంలో.. ఆ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తగిన సూచనలు జారీ చేయడంతో పాటు.. సహాయక చర్యలు చేపట్టేందుకు రెడీ గా ఉంది. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున.. మరమ్మత్తు బృందాలను ముందుగానే సిద్ధం చేశారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్ చిన్న కుమారుడు!
Also Read: America: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
telngana | adilabad | nizamabad | rains | rain-alert | telangana-rain | telangana rain alert | telangana rains today | telangana rains update | telangana rains updates | telangana-rains | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates