/rtv/media/media_files/2025/03/27/XVwK26AT0cNJX1j0k9iD.jpg)
Telangana 2025 10th paper leaked
తెలంగాణ పదవ తరగతి పరీక్షల్లో మరోసారి కలకలం రేగింది. బుధవారం జరిగిన గణితం ప్రశ్నాపత్రంలో నుంచి కొన్ని ప్రశ్నలు లీక్ అయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఓ విద్యార్ధి తండ్రి లోపల తాగునీరు అందించే వ్యక్తికి తెల్ల కాగితం ఇచ్చి పంపగా.. అతడు దానిపై కొన్ని ప్రశ్నలను రాసుకొని బయటకు వచ్చాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మరోవ్యక్తి వాటిని ఫోటోలు తీసి విలేకర్లకు పంపాడు. దీంతో విషయం బయటకొచ్చింది. అనంతరం రంగంలోకి దిగిన ఎస్పీ నర్సింహరెడ్డి, జిల్లా విద్యాధికారి రాజు తదితరుల పేపర్ లీకేజ్ కి కారణమైన కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించినందుకు ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీం, ఇన్విజిలేటర్ దీపికను సస్పెండ్ చేసింది విద్యాశాఖ.
Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
Also Read : ఉగాదికి జగ్గారెడ్డి బిగ్ అనౌన్స్మెంట్.. ఆ రోజునే ప్రారంభం..!
10th Class Paper Leak Case - Kamareddy
latest-news | telugu-news | 10th paper Leak case | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates | telangana news live updates | 10th Exam Paper Leak | 10th Exam Paper Leak Case
Also Read : షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్ మెడిసిన్ ధరలు