NLG: చాక్లెట్ దొంగిలించాడని చితక్కొట్టారు..

రోజురోజుకూ మనుషుల్లా బతకడం మర్చిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. సూపర్ మార్కెట్ లో చాక్లెట్ దొంగతనం చేశాడని ఓ పిల్లాడని చిత్రహింసలు పెట్టిన సంఘటన ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చింది.

New Update
Chocolate: డార్క్ చాక్లెట్..మిల్క్ చాక్లెట్ ఏది ఆరోగ్యానికి మంచిది?

పెద్ద దొంగలను ఏమీ చేయలేరు కానీ చిన్న పిల్లల మీద మాత్రం ప్రతాపం చూపిస్తారు. తిరిగి వాళ్ళు ఏమీ చేయలేరనే ధైర్యంతో. ఇబ్రహీంపట్నంలో చాక్లెట్ దొంగలించాడని ఓ బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ళ బాలుడు  మంచాల మండలం నోములలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి ఇబ్రహీంపట్నంలో ఉన్న మెగా డీమార్ట్ కు సరుకులు కొనుక్కోవడానికి వచ్చాడు.  

అండర్ గ్రౌండ్ లో కట్టేశారు..

అయితే అప్పుడే అదే సమయంలో ఆ పిల్లాడిని చాక్లెట్ దొంగతనం చేశాడంటూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మెగా డీమార్ట్‌ యజమానులు, నిర్వాహకులు నేరం ఆరోపించారు. వెంటనే అతనిని బంధించి అండర్ గ్రౌండ్ లో ఉన్న గొడౌన్ లోకి తీసుకెళ్ళి కట్టేశారు. అక్కడే రాత్రి 8 గంటల వరకు ఉంచి చిత్రహింసలు పెట్టారు. విపరీతంగా కొట్టారు. తరువాత ఈ విషయం బయటకు రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు డీమార్ట్ ముందుకు వచ్చా ఆందోళన నిర్వహించారు. దాంతో పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. బాలుడిని రెస్క్యూ చేసి మొదట స్టేషన్ కు తీసుకెళ్ళారు. తరువాత ఆసుపత్రికి పంపించి చికిత్స చేయించారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీ మార్ట్ మీద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

 today-latest-news-in-telugu | chocolate | boy | theft 

Also Read: Zomato: జొమాటోలో పెద్ద ఎత్తున లేఆఫ్స్...వందల మంది తొలగింపు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎండ తీవ్రత, వడగాలులు అధికంగా ఉంటాయని వెల్లడించింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

New Update
Rains

Rains

ఉపరితల ఆవర్తనం వల్ల మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 30 నుంచి 40 కిమీ వరకు గాలులు ఉండవచ్చని తెలిపింది.

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహూబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఇదిలా ఉండగా.. ఏపీలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వడగాలులు కూడా తీవ్రంగా వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

 

AP Weather Alert | telangana-weather-update | imd alert | latest telangana news | andhra-pradesh-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | heavy-rains

Advertisment
Advertisment
Advertisment