CM Revanth Reddy: రేవంత్‌తో మోహన్ బాబు భేటీ.. అందుకేనా?

సీఎం రేవంత్‌రెడ్డిని టాలీవుడ్‌ నటులు మంచు మోహన్‌బాబు, విష్ణు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్‌‌ సీఎం నివాసంలో ఆయనను కలిసిన మోహన్‌బాబు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో గొడవలు తలెత్తిన విషయం తెలిసిందే.

New Update
 CM Revanth Reddy-mohanbabu-vishnu

CM Revanth Reddy-mohanbabu-vishnu

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని టాలీవుడ్‌ నటులు మంచు మోహన్‌బాబు, విష్ణు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.జూబ్లీహిల్స్‌‌లోని సీఎం నివాసంలో ఆయనను కలిసిన మోహన్‌బాబు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో గొడవలు తలెత్తిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ మధ్య ఆస్తి గొడవలు తలెత్తాయి. ఈ విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. 

Also Read:  Ap Weather:ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!

జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటివద్ద జరిగిన హైడ్రామాలో మోహన్‌బాబు మీడియా ప్రతినిథులపై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ గొడవలు ఇలా కొనసాగుతుండగానే  నిన్న మోహన్‌బాబుపై ఖమ్మం జిల్లాలో కేసు నమోదైంది. నటి సౌందర్యకు సంబంధించిన భూమి విషయంలో సౌందర్యకు, మోహన్‌బాబుకు మధ్య గొడవలు జరిగాయని, ఆ విషయంలోనే సౌందర్యను మోహన్‌బాబు హత్య చేయించాడని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయాన్ని సౌందర్య భర్త ఖండించారు.

ఇది కూడా చదవండి: వివేకా హత్య జరిగిన రోజు అసలేం జరిగిందంటే.. అసెంబ్లీలో సంచలన విషయాలు చెప్పిన చంద్రబాబు!

వరుస వివాదాల నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డిని మోహన్‌బాబు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే  గద్దర్ తెలంగాణ చలన చిత్ర పురస్కారాల విధి విధానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమోదించిన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డిని కలవడంపై సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంచు విష్ణు స్పందించారు. రేవంత్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రేవంత్ గురించి పలు విషయాలు తెలుసుకోవడం, చర్చించడం చాలా అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రేవంత్ రెడ్డి అందిస్తున్న మద్దతు, నిబద్ధతను అభినందిస్తున్నామని మంచు విష్ణు పేర్కొన్నారు.

Also Read:  Dalailama: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment