Uttam Kumar Reddy: సన్నబియ్యం పంపిణీలో తేడా జరిగితే.. ఉత్తమ్ హెచ్చరిక

సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి ఉత్తమ్ అన్నారు. దీనివల్ల 80 శాతం మంది పేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీలో ఏదైనా తేడా జరిగితే కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులను హెచ్చరించారు.

New Update
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

సన్నబియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. దీనివల్ల 80 శాతం మంది పేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీపై సమీక్షించారు. లబ్ధిదారుల ఇళ్లల్లోకి వెళ్లి ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని సూచించారు. 

Also Read: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా కొత్త కోట సీతా దయాకర్ రెడ్డి ...మరో ఆరుగురు కూడా...

శ్రీరామనవమి రోజున భద్రాచంలో ఓ లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండొద్దని చెప్పారు. ఏదైనా తేడా జరిగితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజాప్రతినిధులందరూ రేషన్ దుకాణాలను సందర్శించాలని కోరారు. 

Also Read: కంచ గచ్చిబౌలి భూములపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు.. ఎంట్రీకి పూర్తి నిషేధం!

ఇదిలాఉండగా ఇటీవల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో దీన్ని ప్రారంభించారు. అలాగే దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని సీఎస్‌ శాంతి కుమారి పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు.  

Also Read: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు

 telugu-news | rtv-news | uttam-kumar

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment