/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.
Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా
నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్
ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Telangana: ట్రంప్ టారిఫ్లు మనకు మేలే చేస్తాయి.. శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రంప్ విధిస్తున్న సుంకాలు మనకు మేలే చేస్తాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపే చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Trump and Minister Sridhar Babu
ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఒక రకంగా మనకు మేలే చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని అనుకూలంగా మార్చుకుని ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం(GIBF) ఆధ్వర్యంలో పార్క్ హయత్లో నిర్వహించిన ‘‘ఇండియా - లాటిన్ అమెరికా, కరీబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్’’ రెండో ఎడిషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Also Read: ఎంపురాన్ చిత్ర నిర్మాతకు షాక్...ఈడీచేతికి చిక్కిన రూ.1.5 కోట్లు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల అధికార ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. అలాగే పరిశ్రమల కోసం రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం నుంచి పారిశ్రామివేత్తలకు అందించే ప్రోత్సాహకాలను వివరించారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణ MSMEలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటేలా ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామని తెలిపారు.
Also Read: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు
అంతేకాదు పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్లో పెట్టుబడులు పెట్టేందుకు 6 అంతర్జాతీయ స్థాయి సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. వీటిలో మూడు కొరియా కంపెనీలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ద్వితియ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు, పట్టణాల్లోను పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. అలాగే ఆగ్రో ప్రాసెసింగ్ రంగాన్ని పోత్సహిస్తామని.. అన్నదాతలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
Also Read: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ
telangana | minister-sridar-babu | telugu-news
Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక
రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. Short News | Latest News In Telugu | వాతావరణం
TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
భద్రాధ్రికొత్తగూడెం జిల్లా జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Gym Trainer Kills : జిమ్ నిర్వాహకుడిని చంపిన యువకుడు.. డంబెల్స్తో కొట్టి కొట్టి....
జిమ్ ట్రైనర్ పై డంబెల్ తో దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Allu Arjun : అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత...భారీకేడ్లు తోచుకుని.
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అభిమానులు భారీగా చేరుకొని సందడి చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Accident: హైదరాబాద్లో లారీ బీభత్సం..ట్రాఫిక్ పోలీసు దుర్మరణం!
హైదరాబాద్లో లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద విధుల్లోవున్న. : క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Newly bride suicide : పెళ్లయిన 22 రోజులకే నవ వధవు సూసైడ్..ఎందుకంటే....
పెళ్లయిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ
USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..
Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్
WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్
Instagram: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు