Congress: అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్న స్క్రీనింగ్ కమిటీ..ఛాన్స్ ఎవరికో..?
కాంగ్రెస్లో రెండు నుంచి మూడు అభ్యర్థులు పోటీ పడే నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనుంది స్క్రీనింగ్ కమిటీ.
కాంగ్రెస్లో రెండు నుంచి మూడు అభ్యర్థులు పోటీ పడే నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనుంది స్క్రీనింగ్ కమిటీ.
బీజేపీ, తల్లి తెలంగాణ, బీఆర్ఎస్, కాంగ్రెస్.. మళ్లీ బీజేపీ.. ఇలా అనేక పార్టీల్లో కీలక నేతగా వ్యవహరించిన లేడీ అమితాబ్ సినీ నటీ, మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ మహిళ నేత విజయశాంతి మరోసారి పార్టీ మారుతారాన్న ప్రచారం జరుగుతోంది. సోనియాగాంధీని ప్రశంసిస్తూ తాజాగా రాములమ్మ చేసిన ట్వీట్తో పాటు బండి సంజయ్, మణిపూర్ అంశాల్లో బహిరంగంగా బీజేపీని వ్యతిరేకించిన విజయశాంతి కొంతకాలంగా కమలం పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు..
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం-2023 సందర్బంగా ఆదివారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్రావు ప్రసంగించారు. జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది.
రజాకార్ల రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తుందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిద్దిపేటలోని శివమ్స్ గార్డెన్లో నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అమరవీరుల సంస్మరణ సభలో హాజరై మాట్లాడారు.
తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలోని టెట్ పరీక్షా కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. 8 నెలల గర్భిణీ అయిన రాధిక అనే మహిళ పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్షకు హాజరయ్యారు.
సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని మంత్రి హరీశ్రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి హరీష్రావు.
4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇస్తే కేసీఆర్కు సంబంధించిన 400 కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పలు విమర్శలు చేశారు.