TG Crime: భూ వివాదం.. కొడవలితో తల్లిదండ్రులపై దాడి చేసిన కొడుకు!

జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాలో భూ వివాదం కారణంగా తల్లిదండ్రులపై కొడుకు నరేశ్‌ దాడి చేశాడు. దాడిలో తండ్రి నాగరాజు, తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. దంపతులను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
jagityala crime news

jagityala crime news

TG Crime: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులపై కొడుకు విచక్షణరహితంగా దాడి చేశాడు. అమ్మనాన్న అని కూడా కనీసం కనికరం లేకుండా కొడవలి, గడ్డపారతో దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాం గ్రామంలో జరిగింది. ఈ దాడికి ప్రధాన కారణం భూ వివాదం అని తెలుస్తోంది. దీని కారణంగానే తల్లిదండ్రులపై కొడుకు నరేశ్‌ దాడి చేశాడు. 

భూ వివాదం.. తల్లిదండ్రులపై కొడుకు దాడి: 


ఇది కూడా చదవండి: వీపు మీద మొటిమలు రావడానికి కారణం ఏమిటి?

ఈ  దాడిలో తండ్రి నాగరాజు, తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన దంపతులను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై వివరాలు అడగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: కోదాడలో విషాదం.. ప్రభుత్వ టీచర్ ప్రాణం తీసిన సిగరేట్.. అసలేమైందంటే?


( ts-crime | ts-crime-news | latest-news | telugu-news )

ఇది కూడా చదవండి: 
పెరుగు తింటే పెద్ద పేగు క్యాన్సర్ రాదా.. నిజమెంత?

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: ఎంత ధైర్యం.. ప్రభాస్‌ను ఏంటి భయ్యా అఘోరీ ఇలా అనేసింది- దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!

నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందో? కలిస్తే ఒక్క సెల్ఫీ అడుగుతాను అని వర్షిణి తెలిపింది. వెంటనే అఘోరీ ఏంటీ ప్రభాస్ గోల ఆపు అనేసింది. అది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో అఘోరీని ట్రోల్ చేస్తున్నారు.

New Update

అందరూ ఊహించినట్లుగానే లేడీ అఘోరీ-శ్రీవర్షిణీ మ్యారేజ్ చేసుకున్నారు. అదీ ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌లో బ్రహ్మముహుర్తాన తెల్లవారిజామున 4 గంటలకు వర్షిణీ మెడలో అఘోరీ తాళి కట్టింది. రెండోసారి వర్షిణీ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారం చైన్‌ను మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది. ఇది గడిచి చాలా రోజులే అయింది. కానీ ఇప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

ప్రభాస్ అంటే ఇష్టం

వర్షిణీ మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. అక్కడ నుంచి RTVతో లైవ్ లో మాట్లాడిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తమ ఇష్యూలోకి ప్రభాస్‌ను లాగారు. ప్రభాస్ లాంటి అబ్బాయిని పెళ్లిచేసుకోవాలనిపించలేదా? అనే ప్రశ్నకు వర్షిణీ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ లాంటి అబ్బాయి ఉండడని అనుకున్నాను. కేవలం హీరోస్‌లోనే ఇష్టం.. రియల్ లైఫ్‌లో కాదు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

ప్రభాస్‌ను డైరెక్ట్‌గా ఎప్పుడూ చూడలేదు. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నాను. ప్రభాస్‌ను ఫస్ట్ టైం షూటింగ్ లో కానీ ఎక్కడైనా కలిస్తే ఆయన దగ్గరకి వెళ్లి.. హాయ్ సర్ ఐయామ్ బిగ్ ఫ్యాన్‌ ఆఫ్ యు డార్లింగ్ అని చెప్తాను. అంతేకాకుండా ఒక సెల్ఫీ కూడా అడుగుతాను. అఘోరీని కూడా డార్లింగ్ అని పిలిస్తాను’’ అని అఘోరీని డార్లింగ్ అని పిలిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

అయితే వర్షిణీ ప్రభాస్ గురించి మాట్లాడుతుండగా.. సరిగ్గా అప్పుడే అఘోరీ వచ్చి ఏంటీ ప్రభాస్ గోల అని లైవ్‌లో అనేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తిపోయింది. ఒక్కసారిగా వారు షాక్ అయిపోయారు. తమ అభిమాన హీరో గురించి అఘోరీ అలా అనడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

(aghori | sri varshini | aghori sri varshini | Aghori Sri Varshini Lov | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment