Karimnagar: పండగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రహదారులు నెత్తుటి మరకలు పూసుకున్నాయి. ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సంక్రాంతి సంబరాలతో సందడిగా కనిపించాల్సిన ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ వారి ప్రాణాలను మిగేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. Also Read: Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్చరణ్ ఫ్యాన్స్ ఆవేదన జగిత్యాల జిల్లాలో.. జగిత్యాల జిల్లాలో అరవింద్, సాయి, వంశీ ముగ్గు యువకులు ప్రయాణిస్తున్న బైక్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అరవింద్, సాయి అక్కడిక్కడే మృతి చెందగా.. వంశీ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. పరిస్థితి విషమించడంతో వంశీ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తమ పిల్లలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్.. అమెరికాలో ఏం జరుగుతోంది? పెద్దపల్లిలో మరో ఘటన.. అదే సమయంలో పెద్దపల్లిలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగాపూర్ దగ్గర ట్రక్కు బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజ్ కుమార్, అభినవ్ అనే ఇద్దరు యువకులు స్పాట్ లోనే మరణించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా