/rtv/media/media_files/oum4u0T0hgBMYNJtmsdQ.jpg)
Telangana: వరిలో 33 రకాల సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ గా రూ. 500 లు ప్రకటించిన నేపథ్యంలో బోగస్ను నియంత్రించేందుకు ఐరిస్ విధానాన్ని అమలు చేయబోతుంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అధికంగా కిన్నెరసాని, తాలిపేరు, మూకమామిడి, పెద్దవాగు ప్రాజెక్టులు, చెరువుల కింద 1.64లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు సమాచారం. బోనస్ ప్రకటించిన వేళ ఏపీ, చత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అక్రమంగా రాకుండా అడ్డుకునేందుకు చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేశారు.
Also Read: OU: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన వీసీ
ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షించుకోవాలి. సన్నాలైతే బియ్యం గింజ పొడవు 6ఎంఎం, వెడల్పు 2 ఎంఎం ఉండాలనే నిబంధన అయితే ఉంది. ఇందుకు ప్యాడీ హస్కర్, గ్రెయిన్ కాఫర్లను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అగ్రికల్చర్ ఏఈవోలు, సహకార సంఘం, వ్యవసాయ మార్కెటింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసర్లకు ఇప్పటికే ట్రైనింగ్ఇచ్చారు. ఏఈవోలు సన్నాలుగా గుర్తించి ధ్రువీకరిస్తారు.
Also Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే..వానలు
దళారుల ప్రమేయం లేకుండా ఐరిష్ విధానం అమలు చేస్తున్నారు. ముందుగా కొనుగోలు కేంద్రం పరిధిలోని రైతుల వివరాలను సేకరిస్తారు. రైతు సాగు చేసిన వరి విస్తీర్ణం, ధాన్యం బస్తాలు ఎన్ని క్వింటాళ్లు దిగుబడి వస్తుందనే విషయాలు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్మేనేజ్మెంట్ సిస్టంలో నమోదు చేస్తారు. అదే సమయంలో రైతుల ఐరిస్ను నమోదు చేసుకున్నారు. అప్పుడు రైతు ఫోన్ నంబర్కు ఓటీపీ పంపిస్తారు.
Also Read: Pushpa2 స్టేజీపైనే నిర్మాతపై షాకింగ్ కామెంట్స్ చేసిన దేవిశ్రీ ప్రసాద్
ధాన్యం అమ్మినప్పుడు అసలైన రైతేనా అని ఐరిస్ ద్వారా చెక్ చేసుకుంటారు. సిస్టంలో నమోదు చేసిన దాని ప్రకారం ఐరిస్ చేసిన వెంటనే సిస్టంలోని వివరాలు వచ్చేస్తాయి. ఇలా నగదు నేరుగా రైతుల ఖాతాలో చేరిపోతుంది. గతంలో రైతుల ఆధార్ నంబర్, బ్యాంకు అకౌంట్ను నమోదు చేస్తే సెల్ ఫోన్కు ఓటీపీ వచ్చేది. రైతుల పేరిట వ్యాపారులు, దళారులు ఇతర ప్రాంతాల నుంచి ధాన్యాన్ని అమ్మేవారు. కానీ ఇప్పుడు ఈ అక్రమానికి చెక్ పడింది.
Also Read: Crime: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం!
కౌలు, పోడు భూముల్లో సాగు చేసే రైతులకు ఐరిస్ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి వారు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి అమ్ముకోవాలంటే కష్టతరం అవుతుంది. అయితే కౌలు రైతులకు ఇబ్బందులు రాకుండా ఆఫీసర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక ఏఈవోలను కలిసి ఎవరి నుంచి పొలం కౌలుకి తీసుకున్నారో వివరాలు అందజేయాలి. ఆ వివరాల ప్రకారం ఆన్లైన్ ప్రొక్యూర్ మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎంటర్ చేస్తారు. పోడు రైతుల వివరాలను కూడా ఇదే తరహాలో నమోదు చేయనున్నారు.