HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

హైడ్రాకు సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) విభాగంలో కొత్తగా 357 ని నియమించారు. పోలీస్ నియామక పరీక్షల్లో కొద్ది మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారిని మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేశారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ రోజు వీరి శిక్షణను ప్రారంభించారు.

New Update
HYDRAA New Jobs

HYDRAA New Jobs

HYDRAA Jobs: డీఆర్ఎఫ్‌ (Disaster Response Force) లోకి ఔట్ సోర్సింగ్(Outsourcing Jobs) విధానంలో కొత్తగా 357 మందిని నియమించారు. వారి శిక్షణ ప్రారంభోత్సవంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర కీల‌కమన్నారు. ప్రజల అంచ‌నాలకు అనుగుణంగా ప‌నిచేద్దామ‌ని పిలుపునిచ్చారు. హైడ్రా నిర్వహిస్తున్న విధుల‌న్నిటిలో డీఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌న్నారు. ప్రభుత్వ ల‌క్ష్యాలు, ప్రజల అంచ‌నాల మేర‌కు హైడ్రా ప‌ని చేయాల్సిన‌వ‌స‌రం ఉంద‌న్నారు. ఈ విష‌యంలో అంద‌రూ అప్రమత్తంగా ఉండాల‌ని సూచించారు. అంబ‌ర్‌పేట్ పోలీసు శిక్షణా కేంద్రంలో వారం రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుందన్నారు. ఈ స‌మాజంలోనూ.. ప్రభుత్వ ప‌రంగా హైడ్రా ప్రధానమైన భూమిక పోషిస్తున్న విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప‌ని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read: ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!

Also Read: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

ప్రకృతి వైపరీత్యాల సమయంలో డీఆర్ఎఫ్(Disaster Response Force) పాత్ర కీలకం..

ప్రకృతి వైప‌రీత్యాలు సంభ‌వించినప్పుడు ప్రజల ప్రాణాల‌తో పాటు.. ఆస్తి న‌ష్టాన్ని త‌గ్గించ‌డంలో డీఆర్ఎఫ్ పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌న్నారు. ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడ‌య్యాయ‌న్నారు. మ‌న‌ మీద ఉన్న న‌మ్మకంతో ప్రభుత్వం ప‌లు బాధ్యతలు అప్పగిస్తోందన్నారు. తాజాగా ఇసుక అక్రమ ర‌వాణాను నియంత్రించే ప‌నిని కూడా హైడ్రాకు కేటాయించిందన్నారు. వీట‌న్నిటినీ ఎంతో శ్రద్ధగా, బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

Also Read: కుంభమేళాలో జాగ్రత్త.. మల కోలిఫాం బ్యాక్టీరియా ఎంత డేంజరస్‌ అంటే..!

పోలీసు ప‌రీక్ష రాసి.. కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం పొంద‌లేని వారి మెరిట్ లిస్టు ఆధారంగా.. సామాజిక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ 357 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంతో పార‌దర్శకంగా ఈ ఎంపిక జ‌రిగింద‌న్నారు. ప్రస్తుతం త‌రుణంలో ఉద్యోగాల‌కు ఎంతో పోటీ ఉందన్నారు. ఈ అవ‌కాశాన్ని ప్రతి ఒక్కరూ స‌ద్వినియోగం చేసుకుని ప్రతిభ క‌న‌బ‌ర్చాల‌న్నారు. 

Also Read: BIG BREAKING: వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టు బిగ్ షాక్!

అప్పుడే మరిన్న మంచి అవ‌కాశాలుంటాయ‌న్నారు. ఈ 357 మంది శిక్షణ తర్వాత మరో కొత్త బ్యాచ్ వస్తుందన్నారు. కొత్తగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లో చేరిన సిబ్బంది భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు ప్రజలకు అండ‌గా ఉండేలా.. ప్రాణ‌, ఆస్తి న‌ష్టాల‌ను త‌గ్గించేలా నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment