HYD: ఇన్నాళ్ళూ లీజ్, ఇప్పుడు ఓనర్..లులూ యాజమాన్యం చేతికి మంజీరా మాల్

దివాలా తీసిని మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్ ను లులూ ఇంటర్నేషనల్ షాపింగ్స్ మాల్స్ సొంతం చేసుకుంది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ నిర్వహించిన దివాలా ప్రక్రియలో రూ.318.42 కోట్లకు దీన్ని కొనేసుకుంది. 

New Update
ap

Lulu Mall

హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న మంజీరా మాల్ యాజమాన్య సంస్థ అయిన మంజీరా రిటెయిల్‌ హోల్డింగ్స్‌ చాలా రోజులుగ దివాలా తీసే పరిస్థితిలో ఉంది. మంజీరా రిటెయిల్‌ హోల్డింగ్స్‌ తమవద్ద తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో కేటలిస్ట్‌ ట్రస్టీషిప్‌ గత ఏడాది జులైలో ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దీంతో ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయింింది. దాని కోసం బీరేంద్ర కుమార్ అగర్వాల్ ను రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌గా నియమించింది. 

మంజీరా మాల్స్ ఇప్పుడు లులూ చేతిలో..

ఎన్సీఎల్టీ మంజీరా మాల్స్ దివాలా ప్రక్రియలో భాగంగా బిడ్లను పిలిచింది. దాని తర్వాత చేయాల్సివన్నీ కూడా చేసింది. ఈ దశలన్నింటినీ దాటుకుని లులూ ఇంటర్నేషనల్‌ షాపింగ్‌ మాల్స్, మంజీరా రిటెయిల్‌ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకుంది. రూ.318.42 కోట్లకు మొత్తం అన్ని బిల్డింగ్ లనూ కొనేసుకుంది.  కేటలిస్ట్‌ ట్రస్టీషిప్‌ లిమిటెడ్, ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీఓసీలో ఉన్నాయి. దీంతో ఇంత కాలం లీజ్ తీసుకున్న మంజీరా మాల్ కు ఇప్పుడు లులూ యజమానిగా మారిపోయింది. 

 today-latest-news-in-telugu | hyderabad | lulu-mall 

Also Read: USA: హమ్మ ట్రంప్ మామూలోడివి కాదు..ఇన్ సైడర్ ట్రేడింగ్ తో వివాదం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని

పాకిస్తానీ యువకుడిని హైదరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. గతంలో HYDకి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్న మహమ్మద్ ఫయాజ్.. ఆమెను కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. అతడిని గుర్తించిన పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

New Update
HYD PAHALGAM

HYD PAHALGAM Photograph: (HYD PAHALGAM)

పహల్గాం ఉగ్రవాద దాడి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో భారత్ - పాక్ మధ్య కొన్ని దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.   

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

హైదరాబాద్‌లో పాక్ యువకుడు

దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. ఈ మేరకు తాజాగా హైదరాబాద్ పోలీసులు ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. 

Also Read :  ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

తెలంగాణ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థానీలను వెంటనే వెనక్కి పంపాలన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే భారత్ ను వీడాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 27వ తేదీతో  వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఏప్రిల్ 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వరకు అటారి వాఘ బార్డర్ ఓపెన్ ఉంటుందని తెలిపారు.   

Also Read :  నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

హైదరాబాద్ లో ఉన్న పాకిస్తానీయులపై నిఘా పెట్టామన్న డీజీపీ..  అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా హైదరాబాద్ లో 208మంది పాకిస్థానీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లిపోవాలని ఇటీవల కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కేంద్రం పాకిస్తానీల వీసాలు రద్దు చేసింది. 

Also Read :  బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా

పాకిస్తానీయులపై పోలీసులు నజర్

హైదరాబాద్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై పోలీసులు నజర్ పెట్టారు. పాక్ పౌరుల వివరాలు సేకరించారు. 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్‌లో ఉన్నటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి మరో రెండు రోజుల్లోగా పాకిస్థాన్ వెళ్లిపోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కేంద్ర ఇచ్చిన గడువు ముగుస్తోండటంతో అన్నిరాష్ట్రాలను కేంద్రహోంశాఖ అలెర్ట్ చేసింది. అదే విధంగా పాక్, ఇండియా ఉద్రిక్త పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో సెక్యురీటీ హై అలర్ట్ చేశారు. 

latest-telugu-news | Pahalgam attack | Pahalgam Attack latest news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు