BIG BREAKING: HCU భూముల వ్యవహారం.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు బిగ్ షాక్

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు ప్రభుత్వం విక్రయించకుండా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈకేసు విచారణను ఏప్రిల్7 కోర్టు వాయిదా వేసింది. వివాదంలో ఉన్న భూమిలో చెట్లను నరకొద్దని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పంపింది.

New Update
HCU land high court

HCU land high court Photograph: (HCU land high court)

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ప్రభుత్వం విక్రయించకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 7 కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ వివాదంలో ఉన్న భూమిలో చెట్లను కొట్టివేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌లో ప్రతివాదులకు నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. చెట్లు నరకొద్దని స్టే ఉన్న.. 400 ఎకరాల్లో చెట్లు తొలగిస్తున్నట్లు పిటిషనర్ తరపు న్యాయవాది ఆధారాలు కోర్టుకు చూపించారు. 

Also read: Heavy rain : హైదరాబాద్‌ ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం (VIDEO)

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనున్న 400 ఎకరాల భూమి విక్రయించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయాలు తెలిసిందే. 400 ఎకరాలు అమ్మి అక్కడ కాంక్రీట్ జంగల్ చేయోద్దని HCU విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయంలో పలువురు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. నేడు సుప్రీం కోర్టులో కూడా హెచ్సీయూ భూవివాదం విచారణ జరగనుంది. ఈకేసులో నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు పంపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చెట్లు నరకకుండా చూడాలని సీఎస్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కంచ గచ్చిబౌలి భూవివాదం సెంట్రల్ కమిటీ హైదరాబాద్‌లో వారితో భేటి

కంచ గచ్చబౌలి భూముల వివాదంలో విచారణ జరపడానికి ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. తాజ్‌కృష్ణలో HCUSU, ఏబీవీపీతో విద్యార్థి సంఘాలతో ఎంపవర్డ్ కమిటీ భేటీ అయ్యింది. కమిటీ సీఎస్ శాంతి కుమారి, పోలీస్ అధికారులను విచారించింది.

New Update
HCU land issue 123

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూవివాదంలో విచారణ జరపడానికి ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. విద్యార్థి సంఘాలతో ఎంపవర్డ్ కమిటీ భేటీ అయ్యింది. HCUSU, ఏబీవీపీతో విడివిడిగా కేంద్ర కమిటీ సమావేశమైంది. తాజ్‌కృష్ణలో సెంట్రల్ ఎంపర్డ్ కమిటీ భేటీ అయ్యింది. కంచ గచ్చిబౌలి భూములపై కమిటీ అధ్యయనం చేస్తుండగా.. సీఎస్ శాంతి కుమారి, పోలీస్ అధికారులను కలిశారు. ఇప్పటి వరకు జరిగిన అంశాలపై అధికారులను విచారించారు.

Also Read: Allu Ajun-Atlee: కాపీరైట్ వివాదం..అల్లు అర్జున్, అట్లీ మూవీకి బిగ్ షాక్

Advertisment
Advertisment
Advertisment