గద్దర్‌ను అలా చేసినందుకే KCR గడీలు బద్దలైయ్యాయ్ : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాయుద్ద నౌక గద్దర్‌ను అవమానించినందుకే కేసీఆర్ గడీలు బద్దలైయాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ జయంతి సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను హెచ్చరించారు. గద్దర్‌ని కించపరుస్తూ మాట్లాడితే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు.

New Update
Revanth Reddy Vs KCR

Revanth Reddy Vs KCR

గద్దర్‌ కలవడానికి వచ్చినప్పుడు కేసీఆర్ ఆయన్ని ఇంటి బయట నిలబెట్టినందుకే కేసీఆర్ గడీలు బద్దలైయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ప్రజాయుద్ద నౌక గద్దర్ జయంతి సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గద్దర్‌ను తక్కువ చేసి మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వార్నింగ్ ఇచ్చారు. పద్మ అవార్డులకు గద్దర్ పేరు నామినేట్ చేస్తే.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సభ వేదికగా మండిపడ్డారు. 

ఇది కూడా చదవండి: Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు!

గద్దర్ కుటుంబం ప్రజల కోసం సర్వం కోల్పోయిందని, వారి ఏనాడు నాడు కంటి నిండా నిద్ర పోలేదని ఆయన అన్నారు. నిరంతరం గద్దర్ ప్రజల్లో ఉన్నారు. ఆయన తన గళంతో సమాజానికి స్పూర్తినిచ్చారు. మరో సారి గద్దర్‌పై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే.. బీజేపీ కార్యాలయాలు ఉన్న చోట కాలనీలకు గద్దర్ అన్న పేరు పెడతామని సవాల్ చేశారు. గద్దర్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిష్టాత్మకంగా గద్దర్ అన్న అవార్డులను ఏర్పాటు చేసి.. వాటి బాధ్యతలు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించామని అన్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో మహిళ. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రవీణ్‌, ప్రమీల భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా ప్రమీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ప్రియుడితో కలిసి ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది.

New Update
rangardddy affiar

rangardddy affiar

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను ఉరివేసి చంపిదో భార్య. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌, ప్రమీల దంపతలకు ఇద్దరు సంతానం. అయితే ప్రమీల మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది భర్త ప్రవీణ్ కు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భర్తను చంపేసి ప్రియుడితో కలిసి సుఖంగా ఉండాలని ప్రమీల స్కెచ్ వేసింది.  

Also Read: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Also Read :  Pakistan కి ముందు నుయ్యి వెనక గొయ్యి.. 3 ముక్కలవ్వనున్న పాక్ దేశం!

ప్రియుడిని ఇంటికి పిలిచి

ప్లాన్ లో భాగంగా..  శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన ప్రియుడిని ఇంటికి పిలిచిన ప్రమీల..  ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది. కుటుంబసభ్యులకు,బంధువులకు తన భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. అయితే అనుమానం వచ్చిన ప్రవీణ్‌ తల్లిదండ్రులు, గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వెంటనే  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమీలను అదుపులోకి తీసుకుని విచారించగా..  ఆమె అసలు విషయాన్ని ఒప్పుకుంది. ప్రమీల పాటుగా ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Also Read: ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్‌ యాత్ర.. కేంద్ర విదేశాంగ మంత్రి కీలక ప్రకటన

Also Read :  ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి

 

ranga-reddy | wife | husband | lover

Advertisment
Advertisment
Advertisment