Mallareddy: ఆ హీరోయిన్ కసికసిగా ఉంది.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!

BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కాలేజీలో ప్రిన్సిపల్ కొడుకు హీరోగా నటిస్తూ సినిమా తీశాడు. ఆ మూవీ ప్రమోషన్ ఈమెంట్‌లో హీరోయిన్ కసికాపూర్.. కసికసిగా ఉందని మల్లారెడ్డి అన్నారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మల్లారెడ్డి కామెంట్లపై పలువురు విమర్శిస్తున్నారు.

New Update
mallareddy hot comments

mallareddy hot comments Photograph: (mallareddy hot comments)

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. ఆయన మాటలు, చేష్ఠలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి. తాజాగా ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన హీరోయిన్‌పై చేసిన కామెంట్లకు విమర్శలు వస్తున్నాయి. మల్లారెడ్డి కాలేజ్‌లో పని చేసే ప్రిన్సిపల్ కొడుకు హీరోగా ఓ చిత్రం తెరకొక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మల్లారెడ్డి కాలేజ్‌లో  శుక్రవారం ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి నోరు జారారు. వేదిక మీద ఉన్న హీరోయిన్ కసికాపూర్ గురించి పరిచయం చేస్తూ.. హీరోయిన్ మంచి కసికసిగా ఉందని అన్నారు.

Also read:GST Notices: రోజుకు రూ.500 సంపాదించేవారికి.. రూ.6 కోట్ల ట్యాక్స్ కట్టాలని నోటీసులు

Also read: BIG BREAKING: ఇండియా పక్కనే మరో అతి భయంకరమైన భూకంపం!

అలాగే అసెంబ్లీ కూడా వెళ్లకుండా ఈ కార్యక్రమానికి వచ్చానని మల్లారెడ్డి అన్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మల్లారెడ్డి హీరోయిన్‌పై చేసిన కామెంట్స్, అలాగే అసెంబ్లీకి డుమ్మా కొట్టి మూవీ ప్రమోషన్ ఈమెంట్‌ వచ్చా అన్న వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాదు ఆయన మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. గతకొన్ని రోజుల క్రితమే మల్లారెడ్డి రాబిన్‌హుడ్ సినిమో ప్రి రిలీస్ ఈవెంట్‌లో హీరో నితిన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఇక ఆ మూవీ ఈవెంట్ కూడా మల్లారెడ్డి కాలేజ్‌లోనే జరిగింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HCU భూమిలో మైహోం అపార్ట్మెంట్.. షాకింగ్ విషయాలు!

BRS అధికారంలో ఉన్న సమయంలో HCU సమీపంలోని సర్వే నం.25లో మై హోం విహంగకు 25 ఎకరాలు కట్టబెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. రెండు భవనాలకే వంద ఫీట్ల రోడ్డు వేశారని ధ్వజమెత్తారు. మై హోం విహంగ విద్యార్థి నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు.

New Update

హైదరాబాద్ మై హోం విహంగ వద్ద ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. HCU పై ఈ రెండు పార్టీలు లేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాయని ఆరోపించారు. కంచె గచ్చిబౌలి లోని సర్వే 25లో 2004 లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్టు HCU రిజిస్ట్రార్ సంతకం చేశారన్నారు. ఇందుకు బదులుగా ప్రభుత్వం 397 ఎకరాలు ఇస్తున్నట్లు సంతకం చేశారన్నారు. 534 లో 400 IMG భారత్ కు, 120 ఎకరాలు ఉద్యోగ సంఘాలకు కేటాయించారన్నారు. IMG భారత్ ఒప్పందం ప్రకారం వ్యవహరించలేదన్నారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందన్నారు.
ఇది కూడా చదవండి: HCU Land Issue: హెచ్‌సీయూ వివాదంపై స్పందించిన ప్రకాశ్‌రాజ్

కొట్లాడి సాధించాం..

400 ఎకరాలు ప్రభుత్వ భూమిగా కోర్టుల్లో కోట్లాడి సాధించామన్నారు. ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందాలని కొందరు భావించారన్నారు. ఈ 25 సర్వే నంబర్ లోనే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మై హోం విహంగ కు 25 ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు. ఇక్కడ పెద్ద భవనాలు నిర్మించారన్నారు. రెండు భవనాలకే వంద ఫీట్ల రోడ్డు వేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూమిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు పేర్లతో 20 ఎకరాలు ఆక్రమించే ప్రయత్న చేశాడని ఆరోపించారు. 

ఆ 20 ఎకరాలు ప్రభుత్వం గుంజుకుంటుందన్న భయంతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన మై హోం నిర్మాణాల వద్దకు ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పర్యావరణం దెబ్బతింటుందని.. మై హోం విహంగకు 25 ఎకరాలు ఇచ్చినప్పుడు కేటీఆర్ కు కనిపించలేదా? అని ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందాలు లేకపోతే మై హోం నిర్మాణం చేస్తున్నప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసమే ప్రభుత్వ భూమిని మై హోం కు కట్టబెట్టారన్నారు. 

(HCU Land Dispute | telugu-news | telugu breaking news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment