/rtv/media/media_files/2025/03/11/AqqwQzZjVGMjZHLMlods.jpg)
నవ వధువుతో బీజేపీ నేత పరార్ అయిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే కార్వాన్ నియోజకవర్గంలోని గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురుజాల అరవింద్ (46) కు ఇప్పటికే పెళ్లి అయింది. అతనికి ఓ పాప కూడా ఉంది. అయితే తాజాగా పెళ్లైన ఓ నవ వధువుతో అరవింద్ పరారయ్యాడు. లంగర్ హౌస్ గొల్లబస్తీలో ఉండే యువతికి అరవింద్ తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది.
అరవింద్ ఫొటోకు చెప్పుల దండ
అయితే15 రోజుల కింద ఆ యువతికి అత్తాపూర్ కు చెందిన మరో యువకుడితో వివాహమైంది. ఈ క్రమంలో మూడురోజుల కింద అరవింద్ బండ్లగూడ సమీపంలోని ఆర మైసమ్మ ఆలయం వద్దకు ఆ యువతిని పిలిపించి అక్కడినుంచి ఆమెను తీసుకుని పారిపోయాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సోమవారం లంగర్ హౌస్ లో అరవింద్ ఫొటోకు చెప్పుల దండ వేసి నిరసన చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
Also read : పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు.. రచ్చలేపిన గ్యాంగ్ వార్- వీడియో చూశారా?