Hyderabad: బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..!

హైదరాబాద్ లోని వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు ఓ ముఖ్య హెచ్చరికను జారీ చేశారు.నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు తెలిపారు.

New Update
Traffic Restrictions : నేడు బక్రీద్‌..హైదరాబాద్‌ లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

Hyderabad: హైదరాబాద్ లోని వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు ఓ ముఖ్య హెచ్చరికను జారీ చేశారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించ‌నున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో... నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం నుంచి 28వ తేదీ వరకు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవీస్ చెప్పారు.

Also Read:  100 కి.మీ వేగంతో గాలులు..ఆ రెండు జిల్లాలకు అలర్ట్‌!

ఈ నేపథ్యంలో.. నిర్ణీత సమయంలో గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను మూసి వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఆ మార్గం గుండా ప్రయాణాలు సాగించే వాహ‌న‌దారులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఆర్‌డీపీ పనులలో భాగంగా గత కొంత కాలంగా శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Also Read: అందుకే షర్మిలపై జగన్ పిటిషన్... YCP సంచలన ట్వీట్!

వారం రోజుల పాటు...

అయితే.. మిగతా సమయంలో వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. అయితే.. రాత్రి 11 గంటల తర్వాత ప్రయాణాలు సాగించే వారు ఈ వారం రోజుల పాటు... ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.అయితే.. బయోడైవర్సిటీ జంక్షన్‌ నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ బైపాస్‌ చేస్తూ బిచ్చారెడ్డి స్వీట్స్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ మీదుగా ఐఐఐటీ జంక్షన్‌కు చేరుకునేలా ట్రాఫిక్‌ను మళ్లీస్తున్నారు. 

Also Read:  ఇక చెట్ల పరిరక్షణ ధ్యేయం‌‌–హైడ్రా రంగనాథ్

మరోపక్క.. ఐఐఐటీ జంక్షన్‌ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌కు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్‌ పక్క నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునే వీలు కల్పించారు. ఈ ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు తమ గమ్యస్థానాలకు సులభంగా, సురక్షితంగా చేరుకోవాలని అధికారులు చెప్పారు.

Also Read: కేఏపాల్ హైకోర్టులో వాదనలు..హైడ్రాకు కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

గ్రూప్-1 అవకతవకలను ఆధారాలతో బయటపెట్టామని బీఆర్‌ఎస్‌ నేత రాకేశ్‌ రెడ్డి అన్నారు. టాప్‌ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి ఎందుకు లేరన్నారు. ఇందులో జరిగిన అవకతవకలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అలాగే టీజీపీఎస్సీపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు.

New Update
BRS Leader Rakesh Reddy

BRS Leader Rakesh Reddy

బీఆర్‌ఎస్‌ నేత రాకేశ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పూర్తి ఆధారాలతో గ్రూప్-1 అవకతవకలను బయటపెట్టామని తెలిపారు. టీజీపీఎస్సీకి క్షమాపణ చెప్పే ప్రసక్తిలేదన్నారు. అవకతవకలపై ప్రశ్నలకు టీజీపీఎస్సీ ఎందుకు సమాధానాలివ్వట్లేదని ప్రశ్నించారు. నోటీసులు జారీ చేయడంపై ఉన్న శ్రద్ధ అభ్యర్థులకు జవాబు ఇవ్వడంలో ఉండాలన్నారు.  

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

'' గ్రూప్‌ -1 ఫలితాల్లో టాప్‌ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి లేదు. ఇలా ఎందుకు జరిగింది ?. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేరువేరు హాల్‌టికెట్లు ఎందుకు ఇచ్చారు. మహిళలు, పురుషులకు వేరువేరు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారు ?. మొత్తం 46 సెంటర్లు ఉంటే 2,3 సెంటర్ల నుంచే టాపర్స్‌ ఎందుకు వచ్చారు ?. 

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

రిటైర్డ్, కాంట్రాక్టు లెక్చరర్లతో గ్రూప్‌-1 పేపర్లు ఎందుకు దిద్దించారు. మేము ఇందులో జరిగిన అవకతవకలపై పోరాటం కొనసాగిస్తాం. దీనిపై న్యాయ విచారణ జరపాలి. ఇలా చేస్తే మేము ఆధారాలు చూపిస్తాం. నేను టీజీపీఎస్సీపై పరువు నష్టం దావా వేస్తానని'' రాకేశ్ రెడ్డి అన్నారు. ఇదిలాఉండగా గ్రూప్ -1 ఫలితాలు వచ్చాక తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

group-1 | telugu-news | brs | congress 

 

Advertisment
Advertisment
Advertisment