BIG BREAKING: గాంధీ భవన్ వెనుక మర్డర్!

హైదరాబాద్‌లో వరుస మర్డర్లు కలకలం రేపుతున్నాయి. ఉదయం చంపాపేట పరిధి అంబేడ్కర్‌వాడలో అడ్వొకేట్‌ ఇజ్రాయెల్‌పై హత్య జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే గాంధీ భవన్ వెనుక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఓ వ్యక్తి మర్డర్ వెలుగులోకి వచ్చింది.

New Update

TG Crime: భాగ్యనగర్‌ ప్రజలలో హై టెన్షన్‌ నెలకొంది. వరుస మర్డర్లతో హైదరాబాద్‌ వాసులు గజగజ వణుకుతున్నారు. చంపాపేట పరిధి అంబేడ్కర్‌ వాడలో అడ్వొకేట్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. న్యాయవాది ఇజ్రాయెల్‌ను కత్తులతో పొడిచి దారుణంగా చంపారు గుర్తు తెలియని దుండగులు. ఈ విషయం ఇలా ఉంటే తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. గాంధీ భవన్  దగ్గర నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఉన్న మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. 

బండరాళ్లతో కొట్టి చంపినట్టు గుర్తులు..

ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టి చంపినట్టు గుర్తులు ఉన్నాయి. మృతి చెందిన వ్యక్తి 25 సంవత్సరాలు ఉన్నట్లు సమాచారం.  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దాడిపై మరింత సమాచారం కోసం చుట్టు పక్కన ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు.


యువకుడి మృతదేహంపై తీవ్ర గాయాలు ఉండటంతో.. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్దారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య ఎలా జరిగింది అనే విషయంపై దర్యాప్తు చేసి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

 

(ts-crime | ts-crime-news | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bhadrachalam Temple : భద్రాద్రి రామయ్యకు"ప్రభుత్వ" కానుక..ఆనాటి నుంచే…..

భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకులకు ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ ఆనావాయితీ నిజాం పాలన నుంచే అంటే 1890లలో ఆరో నిజాం కాలం నుంచి కొనసాగుతోంది.

New Update
Bhadrachalam Temple

Bhadrachalam Temple

Bhadrachalam Temple : భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకులకు ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఆనావాయితీ ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన తర్వాత నుంచే వస్తుందనుకుంటారు. కానీ నిజానికి దీనికి 135 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అంటే నిజాం పాలన నుంచే ఆ ఆచారం కొనసాగుతోంది. 1890లలో ఆరో నిజాం కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
 
భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. మిథిలా మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రతి ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు. నిజాం కాలం నుంచే మత సామరస్యానికి ప్రతీకగా.. భద్రాచలం రాములవారి కల్యాణానికి సర్కార్ నుంచి కానుకలు అందేవి. 1890లలో హైదరాబాద్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి బృందం ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ తరపున భద్రాచలం ఆలయానికి కానుకలు సమర్పించారు. ఈ సంప్రదాయం కుతుబ్ షాహీలతో ప్రారంభమై నేటికీ తెలంగాణ ప్రభుత్వం ద్వారా కొనసాగుతోంది. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి నిజాం నవాబులు కానుకలు అందించిన చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు కూడా ఉన్నాయి. నిజాం రాజవంశం, ముఖ్యంగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన దాతృత్వంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా నిలిచారు. ఆయన మత విశ్వాసాలకు అతీతంగా హిందూ, ముస్లిం దేవాలయాలకు, ఇతర సంస్థలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. భద్రాచలం ఆలయానికి సంబంధించి నిజాం రాజులు ఈ పుణ్యక్షేత్రాన్ని గౌరవించారు. ఆలయ నిర్వహణకు ఆర్థిక సహాయం కూడా అందించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భద్రాచలం ఆలయానికి రూ. 29,999 విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ సొమ్ము ఆ కాలంలో చాలా ఎక్కువ అని దాన్ని ఆలయ అభివృద్ధికి ఉపయోగించినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అంతేకాకుండా భక్త రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న ప్రజాధనాన్ని రాములవాడి దేవాలయ నిర్మాణానికి వెచ్చించి గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానాషా చేత ఖైదు చేయబడినప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు రామదాసుకు రుణం తీర్చడానికి రామముద్రలతో బంగారు నాణేలు అందించారని పురాణ కథనం ఉంది. ఈ సంఘటన తర్వాత, తానాషా రామదాసును విడుదల చేసి ఆలయానికి గ్రామాలను దానం చేసినట్లు చెబుతారు. ఈ గ్రామాల ఆదాయం ఆలయ నిర్వహణకు ఉపయోగపడింది. ఆ తర్వాత కాలంలో నిజాం రాజులు భద్రాచలం ఆలయం చుట్టూ ఉన్న భూముల ద్వారా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెట్టినట్లు ఆధారాలు ఉన్నాయి. అలా మొదలైన ఈ ఆనవాయితీ ఉమ్మడి రాష్ర్టంలోనూ కొనసాగింది. తెలంగాణ వచ్చిన తర్వాత నేటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment