బండి సంజయ్కి బిగ్ రిలీఫ్.. ఆ కేసును కొట్టేసిన హైకోర్టు!

బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది.  గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ కామెంట్స్ ఉన్నాయంటూ కొంతమంది సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
Bandi Sanjay Comments on Delhi Election Results

Bandi Sanjay Comments on Delhi Election Results

కరీంనగర్ బీజేపీ ఎంపీ,  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది.  గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ కామెంట్స్ ఉన్నాయంటూ కొంతమంది సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే ఈ కేసు కొట్టివేయాలంటూ బండి సంజయ్ హైకోర్టులో ఫిటిషన్ వేశారు.  దీనిపై ఇవాళ విచారణ జరగగా.. ఎలాంటి ఆధారాలు లేవని బండి సంజయ్ తరుపు న్యాయవాది వాదించారు.  ఆ వాదనలతో ఏకీభవించిన కోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  

కేటీఆర్, సీఎం రేవంత్ లకు ఊరట...  

2020 మార్చిలో నార్సింగిలో సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు నిన్న కొట్టివేసింది.  జన్వాడలో డ్రోన్‌ ఎగురవేశారని రేవంత్‌రెడ్డితో పాటుగా పలువురిపై కేసు నమోదైంది.  2020మార్చిలో రేవంత్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు నార్సింగి పోలీసులు. 2020 మార్చిలో ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ చేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.  జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదన్నారు రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది.  రేవంత్‌రెడ్డిపై తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటూ న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసును కొట్టివేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.  

అలాగే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసును సైతం హైకోర్టు కొట్టివేసింది.  సీఎం రేవంత్‌రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని కేటీఆర్‌పై సైఫాబాద్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  ఎంపీ అనిల్‌ కుమార్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సైఫాబాద్‌ పోలీసులు. కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు కేటీఆర్‌.  సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పీపీ వాదించగా..  రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారని కేటీఆర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.  ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కేసును కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  

Also read :  హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sri Rama Navami Shobha Yatra : వైభవంగా కొనసాగుతోన్న శ్రీరామ శోభాయాత్ర

హైదరాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. మంగళ్‌హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది.

New Update
Sri Rama Navami Shobha Yatra

Sri Rama Navami Shobha Yatra

Sri Rama Navami Shobha Yatra : హైదరాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతంలోని సీతారాం భాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది. కాగా శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా పలు హిందూ సంఘాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మంగళ్‌హాట్ ప్రాంతంలోని సీతారాం భాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తం 6.3 కి.మీ మేర ఈ శోభాయాత్ర సాగుతుంది.

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

 ఈ శోభాయాత్రకు వేలల్లో రామ భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. దాదాపు 20 వేల మంది విధుల్లో ఉండి పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
 
శోభాయాత్ర మార్గమంతా అడుగడుగున సీసీ కెమెరాల నిఘా కొనసాగనుంది. శోభాయాత్ర పర్యవేక్షణ కోసం జాయింట్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతలో భాగంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులు శోభాయాత్రను మానిటర్ చేయనున్నారు. భక్తులు శాంతియుతంగా, భక్తిభావంతో శోభాయాత్రలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. 

Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

Advertisment
Advertisment
Advertisment