అందుకే సీఎం రేవంత్ ను కలిశా.. హరీష్ రావు క్లారిటీ!

సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై హరీష్ రావు స్పందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యల పైనే సీఎం రేవంత్ ను కలిశానన్నారు హరీష్. కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన హైస్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎంను కోరామన్నారు.

New Update
CM Revanth Reddy,Harish Rao

CM Revanth Reddy,Harish Rao

సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యల పైనే సీఎం రేవంత్ ను కలిశానన్నారు హరీష్. సికింద్రాబాద్ లో  కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన హైస్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎంను కోరామన్నారు.  సీఎం వెంటనే స్పందించి వేం నరేందర్ రెడ్డికి ఆ పేపర్ ఇచ్చి ఆ పనులు అయ్యేలా చూడాలని చెప్పారని తెలిపారు.  పద్మారావు రమ్మంటేనే సీఎంను కలిసేందుకు తాను వెళ్లానని అన్నారు హరీష్ రావు. తాము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారని... 15 నిమిషాల పాటు సీఎంతో ఏమీ మాట్లాడలేదని..  ఆ తరువాత తాము కలిసి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం ఇచ్చామన్నారు.

Also read :  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్.. కేఎల్ రాహుల్ దూరం!

Also Read :  ప్లే స్టోర్‌లో గూగుల్ 331 యాప్స్ రిమూవ్.. అవి మీ ఫోన్‌లో ఉంటే యమ డేంజర్

సీఎం రేవంత్‌ను కలిసిన మల్లారెడ్డి కుటుంబం 

 అంతకు ముందు సీఎం రేవంత్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. కాగా  సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం చెన్నై బయలుదేరారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన డీలిమినేషన్‌పై రేపు(శనివారం) చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ అఖిలపక్ష సమావేశానికి రేవంత్‌ తో సహా బీఆర్ఎస్ అగ్రనాయకులు కూడా హాజరుకానున్నారు.

Also Read :  రేషన్​కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఊగాది నుంచి కార్డుపై...

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Newly bride suicide : పెళ్లయిన 22 రోజులకే నవ వధవు సూసైడ్..ఎందుకంటే....

పెళ్లయిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. నవవధువు మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
Newly bride suicide

Newly bride suicide Photograph: (Newly bride suicide)

Newly bride suicide : 

 వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన కంది కవిత- శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా చిన్న కూతురు శృతిని పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి గత నెల16న వివాహం జరిపించారు.

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఈ సమయంలో వరకట్నం కింద 9 తులాల బంగారం, రూ .5 లక్షల కట్నంతో పాటు ఇతర వంట సామగ్రి అందజేశారు. వివాహ సమయంలో ఒప్పుకున్న దాని ప్రకారం లాంచనాలు ఇచ్చి పెళ్లి జరిపించారు. అయితే పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత నుంచి భర్త సాయితో పాటు అత్త మామ లక్ష్మి, శంకరయ్య మానసికంగా ఇబ్బంది పెడుతూ పెళ్లికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుండి తేవాలని శ్రుతిని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

దీంతో శృతి భర్త సాయికి నిన్న (సోమవారం) రాత్రి 50 వేల రూపాయలు అందజేసి మిగతా సొమ్మును తొందరలో ఇస్తామని నచ్చజెప్పి శృతి తల్లిదండ్రులు టీకనపల్లి గ్రామానికి తిరిగి వెళ్లారు. దీంతో మనస్థాపానికి గురైన శృతి తెల్లవారుజామున 6 గంటల సమయంలో అత్తగారిం ట్లోని బాత్రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు శృతి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శృతి ఆత్మహత్యకు కారకులైన అత్త, మామ, భర్తను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

ఇది కూడా చదవండి:  హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ యాక్సిడెంట్.. స్పాట్లో ముగ్గురు.. నాలుగో ఫ్లోర్ నుంచి కుప్ప కూలడంతో.. !
 

 

 

Advertisment
Advertisment
Advertisment