TGPSC: గ్రూప్-3 ప్రిలిమినరీ 'కీ' విడుదల.. ఇదిగో లింక్

తెలంగాణలో గ్రూప్-3 ప్రిలిమినరీ 'కీ'ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in లోకి వెళ్లి అభ్యర్థులు 'కీ' ని చూసుకోవచ్చు. జనవరి 12 సాయంత్రం 5 గంటల వరకు కమిషన్ అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించనుంది.

New Update
Group 3 Key

Group 3 Key

TGPSC: తెలంగాణలో గ్రూప్-3 ప్రిలిమినరీ 'కీ'ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌  tspsc.gov.in లోకి వెళ్లి అభ్యర్థులు 'కీ' ని చూసుకోవచ్చు. జనవరి 12 సాయంత్రం 5 గంటల వరకు కమిషన్ అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించనుంది. ఇంగ్లీష్‌లోనే అభ్యంతరాలు తెలియజేయాలని, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలని సూచించింది. ఈ-మెయిల్ లేదా వ్యక్తిగతంగా వెళ్లి సమర్పించేందుకు పర్మిషన్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. 

Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!

ఇదిలాఉండగా.. రాష్ట్రంలో 1365 ఉద్యోగ ఖాళీల కోసం గత ఏడాది నవంబర్ 17,18న గ్రూప్ 3 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తందా 1401 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం మూడు పేపర్లకు పరీక్షలు జరిగాయి. అయితే గ్రూప్ 3 కోసం రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ 2,69,483 లక్షల మంది మాత్రమే అంటే దాదాపు సగం మంది అభ్యర్థులే పరీక్షకు హాజరయ్యారు. 

Also Read: దేశంలో మరో కొత్త వైరస్.. పట్టుకుంటే 3 రోజుల్లో జుట్టు మటాష్!

ఇదిలాఉండగా టీజీపీఎస్సీ మరో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పేర్కొంది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా ఖాళీ ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో కసరత్తు చేస్తామని పేర్కొంది. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చాక 6 నుంచి 8 నెలల్లోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని కమిషన్ స్పష్టం చేసింది. 

Also Read: నా కొడుకు చెప్పేవి వినొద్దు.. ఎలాన్ మస్క్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

Also Read: ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మేనకోడలు.. మామ చేసిన పనికి అంతా షాక్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్.. ఆరుగురు విద్యార్థులు సూసైడ్

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Death

Death

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అశ్విని కి తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపంతో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది.

Also Read: పహల్‌గామ్ ఉగ్రదాడికి సూత్రధారి వీడే .. లష్కరే తోయిబా టాప్ కమాండర్!

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి  చెందిన ఓ విద్యార్థి స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదివాడు. రిజల్ట్స్ చూసుకోగా ఫెయిలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు సమీపంలో అవంతినగర్‌కు చెందిన ఓ విద్యార్థి బల్కంపేటలోని ఇంటర్ ఫస్టియర్ చదివాడు. 

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆవేదనకు గురయ్యాడు. సాయంత్రం ఎవరూ లేని సమయాన్ని చూసి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక నాగోలు తట్టిఅన్నారం వైఎస్‌ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్‌ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యింది. ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఉరేసుకొని సూసైట్ చేసుకుంది. 

Also Read: విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్‌.. నేడు జేడీ వాన్స్‌!

బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్న సుమతి, రామకృష్ణ కూతురు నిష్ఠ.. ఇంటర్‌ ఫస్టియర్ చదవింది. అయితే కెమిస్ట్రీలో ఫెయిల్‌ కావడంతో బలవన్మరణానికి పాల్పడింది. మేడ్చల్‌ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన విద్యార్థిని  కార్పొరేట్ కాలేజ్‌లో ఇంటర్ చదివింది. సెకండియర్‌లో అనుకున్న మార్కులు రాలేదని సూసైడ్ చేసుకుంది. 

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

telugu-news | rtv-news | national-news | inter-results | suicide 

Advertisment
Advertisment
Advertisment