Hyderabad : హైదరాబాద్‌లో తక్కువ ధరకే మేక, గొర్రె మాంసం...ఇది తింటే ఇక బతికినట్టే..

హైదరాబాద్‌లోని పలు హోటల్స్‌ మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. తక్కువ ధరకే వస్తుందని నిల్వచేసిన కుళ్లిపోయిన మేక, గొర్రె మాంసాన్ని కొనుగోలు చేసి కస్టమర్లకు వండి వడ్డిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ , జీహెచ్ఎంసీ నిర్వహించిన దాడుల్లో కుళ్లిన మాంసం పట్టుబడింది.

New Update
 Food safety officers raid

Food safety officers raid

 Hyderabad: హైదరాబాద్‌లోని పలు హోటల్స్‌ మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. తక్కువ ధరకే వస్తుందని నిల్వచేసిన కుళ్లిపోయిన మేక, గొర్రె మాంసాన్ని కొనుగోలు చేసి కస్టమర్లకు వండి వడ్డిస్తున్నారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో  నిర్వహించిన దాడుల్లో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగుచూశాయి.  

ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్ నగరంలోని డబీర్‌పురలో మాతాకీ కిడ్కి ప్రాంతంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో, అక్రమంగా పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి వాటిని వివిధ వివాహాలు, హోటల్స్‌కి సరఫరా చేస్తున్న మహమ్మద్ మిస్బాహుద్దీన్ అనే 24 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహమ్మద్ మిస్బాహుద్దీన్ తన వద్ద 2 క్వింటాళ్ల పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ చేసి వాటిని తక్కువ ధరకు వివాహాలు, హోటల్స్‌కి విక్రయిస్తున్నాడు. పోలీసులు అతని వద్ద నుంచి పాడైన మాంసం సీజ్ చేశారు,

ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!


మహమ్మద్ మిస్బాహుద్దీన్ పాడైపోయిన మేక, గొర్రెల తలకాయలు, కాళ్ళు, బోటీ, లివర్ లను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి.. పెళ్ళిళ్ళు హోటల్స్ కి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.  రెండ్రోజుల క్రితం గోషామహల్ లో 12 టన్నుల పాడైన మాంసాన్ని పోలీసులు సీజ్ చేశారు. పాడైపోయిన ఈ మాంసాన్ని స్టోర్ చేసి.. తక్కువ ధరకు బల్క్ గా అమ్ముతున్నట్లు దాడుల్లో గుర్తించారు. ఎక్కువగా ఓల్డ్ సిటీ అడ్డాగా ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు చేస్తున్నారు. వారాల కొద్దీ నిల్వ చేసిన మేకలు, గొర్రెల మాంసం, వాటి విడి భాగాలను పలు శుభకార్యాలకు, హోటళ్లకు సరఫరా చేస్తున్న ఓ మాంసం వ్యాపారిని మంగళ్‌హాట్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే 12 టన్నుల మాంసాన్ని, వాటి విడి భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి మంగళ్‌హాట్‌ పోలీసులకు అప్పగించారు.

Also Read :  లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

ఇవాళ(మార్చి 21)న ఉదయం కొండాపూర్ లోని కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు.  కిచెన్ అపరిశుభ్రవంగా ఉండటంతో పాటు   డ్రైనేజీ వాటర్‌ పొంగుతున్నట్లుగా  గుర్తించారు అధికారులు. చెడిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన ఇతర వస్తువుల వాడుతున్నట్లు గుర్తించారు. హోటల్ లో పని చేస్తున్న  స్టాఫ్ కూడా కనీసం హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ కాప్స్ కూడా ధరించడం లేదని తెలిపారు  ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా డిస్ ప్లే చేయలేదని చెప్పారు.

Also Read: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న 'లూసిఫర్‌2: ఎంపురాన్‌' ట్రైలర్..!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

New Update
Rains

Rains

 Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment