కాంగ్రెస్ లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అని సినిమా పేరు ఫిక్స్ అయ్యింది. స్వయంగా జగ్గారెడ్డే ఆ మూవీ పోస్టర్, అప్డేట్స్ చెప్పారు. వచ్చే ఉగాదిలోగా సినిమా లిరీజ్ అవుతుందన్నారు. పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి అనుమతితోనే సినిమాల్లోకి వస్తున్నానని ఆయన స్ఫష్టం చేశారు.
త్వరలో సినిమాల్లోకి జాగ్గా రెడ్డి
— Ashok Reddy journalist /అశోక్ రెడ్డి/अशोक रेड्डी (@reddyashokap) March 10, 2025
ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్ గా జగ్గారెడ్డి క్యారెక్టర్.
పాన్ ఇండియా చిత్రంగా ఉంటుంది
దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తాం
తెలుగు,హిందీ భాషల్లో చిత్రం ఉంటుంది#జగ్గారెడ్డి#jaggareddy#filim pic.twitter.com/S3enoBgMlN
ఆయన క్యారెక్టర్కు తగ్గట్టుగా సినిమాలో పాత్ర ఉంటుందని రివీల్ చేశారు. ఇంటర్వెల్ ముందు నుంచి మూవీ చివరి వరకూ జగ్గారెడ్డి పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి సినిమా పోస్టర్లో ఆయన మాస్, ఫ్యాక్షన్ హీరో క్యారెక్టర్గా కత్తులతో కనిపిస్తున్నారు. బాలయ్య రేంజ్లో పోస్టర్ కటౌట్ ఉంది. జగ్గారెడ్డి నటిస్తున్న సినిమాలో లవ్ స్టోరీ ఉంటుందట. ఈ సినిమాకి వడ్డి రామానుజం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.
Also read: Pranay murder case: ప్రణయ్ హత్యకేసులో అమృత చెల్లి ఆవేదన.. ‘అంతా అమృతే చేసింది’
జగ్గారెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమిపాలు అయ్యాడు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థినే అని చెప్పుకున్నారు. తీరా ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓడిపోయారు. కొన్నిరోజులుగా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కూడా ఆయనకు దక్కలేదు. దీనిపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. ఎప్పుడూ ఆయన ఎమ్మెల్సీ కోరుకోలేదని అన్నారు. కొన్ని నెలల క్రితం మహిళా కలెక్టర్పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. విధులకు హాజరుకాలేదని కలెక్టర్తో దురుసుగా మాట్లాడారు.
MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్కు బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బిగ్షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్పై మంగళ్హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
mla-rajasingh cases
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బిగ్షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్పై మంగళ్హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. శోభాయాత్రలో రాజాసింగ్ మాట్లాడుతూ ఉండగా.. భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ.. భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో భక్తులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తే..లాఠీలకు మేమూ పని చెప్తామంటూ రాజాసింగ్ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
ఇక ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు.
ముస్లింలకు వ్యతిరేకం కాదు
వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు.
Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్ ఎగుమతి
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!
BIG BREAKING: ఆర్బీఐ గుడ్న్యూస్.. మళ్లీ వడ్డీ రేట్లు తగ్గింపు
Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..
మేం రాగానే...టీడీపీ వాళ్లను నరికేస్తాం : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!