/rtv/media/media_files/2025/03/15/L9Azk72G3ZtUm77AQO4j.jpg)
Drugs seized in Shamshabad
Durgs : గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తి శంషాబాద్ లో ఓ సినిమా థియేటర్ వద్ద 15 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మహారాష్ట్రకు చెందిన అభిషేక్ బెంగళూరు నుండి డ్రగ్స్ తీసుకువచ్చి గత కొన్ని రోజులుగా శంషాబాద్ లో విక్రయిస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది.
Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే
ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
నిందితుడు గతంలో మహారాష్ట్ర లో కిరాణా షాపుతోపాటు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అయితే కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు రావడంతో బెంగళూరుకు మాఖాం మార్చాడు. అక్కడ ఆన్ లైన్ లో డ్రగ్స్ కు సంబంధించి సెర్చింగ్ చేశాడు. దీంతో అతనికి నైజీరియన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. నైజీరియన్ వ్యక్తి ద్వారా ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి అతను తీసుకునేవాడు. కొన్నాళ్లు గడిచిన తర్వాత దానిని ఇతరులకు విక్రయించేవాడు. అదే తరహాలో శంషాబాద్ లో ఎండిఎం ఏ డ్రగ్స్ ను సినిమా థియేటర్ వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఆర్జీఐఏ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
నిందితుని వద్ద 15 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ ఎండి ఎంఎం డ్రగ్స్ విలువ లక్ష 80 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. అలాగే స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను క్లూస్ టీం, రెవెన్యూ బృందం పరిశీలించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితుడు అభిషేక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్మెయిల్ చేస్తూ.. చివరికి!
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు