Hyderabad: డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని లక్షలు కొట్టేశాడు, తీరా చూస్తే!

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ దాస్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని విడతల వారీగా డబ్బులు కట్టించుకున్నాడు. నకిలీ తాళాలు, డాంక్యుమెంట్లు వారికి ఇచ్చాడు. తీరా వారు ప్లాట్ల వద్దకు వెళ్లి చూడగా వేరే వారు ఉండటంతో షాక్ అయ్యారు.

New Update
fraud,

కష్టపడి డబ్బులు సంపాదించేవాళ్లు కొందరైతే.. వారినుంచి డబ్బులు కొట్టేసేవారు మరికొందరు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాల్లు డబ్బులు ఎలా దోచేయాలా అని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు నమ్మిన వారినే మోసం చేస్తున్నారు. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని లక్షల్లో తీసుకున్నాడు ఓ వ్యక్తి. 

ఇది కూడా చదవండి: 'రేవంత్‌ను చంపేందుకు కుట్ర'

నమ్మించి లక్షల్లో కొట్టేశాడు

నమ్మించేందుకు రూం తాళాలు, డాక్యుమెంట్స్ సైతం బాధితులకు ఇచ్చాడు. కానీ అక్కడికి వెళ్లి చూడగా.. అంతా షాక్ అయ్యారు. పార్లమెంట్ ఎలక్షన్లకి ముందు జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వేణుగోపాల్ అనే వ్యక్తి విడతల వారీగా బాధితు నుంచి డబ్బులు తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు!

ఆ సమయంలోనే డాంక్యుమెంట్లు ఇవ్వాలని అడగగా.. ఎంపీ ఎన్నికలు ఉన్నాయని వాయిదా వేస్తూ వచ్చాడు. ఇక లాభం లేదని అతడిని ఒత్తిడి చేయగా.. నకిలీ తాళాలు, డాంక్యుమెంట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. అదంత నిజమేనని నమ్మిన బాధితులు ప్లాట్ల వద్దకు వెళ్లి చూడగా.. అంతా షాక్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు!

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ దాస్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని బాగా ప్రచారం చేసుకున్నాడు. మొదటి విడతగా తక్కువ మొత్తం కట్టాలని నమ్మించాడు. వేణుగోపాల్ మాటలు నమ్మిన కొందరు మహిళలు నిజమేనని అనుకున్నారు. దీంతో మొదటివిడతగా రూ.50,000 కట్టారు.

ఇది కూడా చదవండి:  బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు!

దీంతో డబ్బులు కట్టిన వారి వివరాలను వేణుగోపాల్ తీసుకున్నాడు. ఆపై వారిని నమ్మించేందుకు నకిలీ తాళాలు, డాంక్యుమెంట్లు తయారు చేసి డబ్బులు కట్టిన మహిళలకు అందించాడు. అంతేకాకుండా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుందని నమ్మించాడు. వేణుగోపాల్ మాటలు నమ్మిన బాధితులు ఒక్కొక్కరు దాదాపు రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు కట్టారు.

అనంతరం అమౌంట్ కట్టి బాధితులు డాక్యుమెంట్లు, బెడ్ రూం తాళాలు పట్టుకుని డబుల్ బెడ్ రూం ప్లాట్ల వద్దకు వెళ్లారు. అయితే వారు వెళ్లేసరికి అక్కడ వేరేవాళ్లు ఉండటంతో అంతా షాక్ అయ్యారు. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు కేపీహెచ్ బీ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వేణుగోపాల్ దాస్ ను అరెస్టు చేసి తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoists Surrenders : మావోయిస్టులకు షాక్‌...13 మంది లొంగుబాటు

వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.  తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

New Update
Maoists Surrenders

Maoists Surrenders

Maoists Surrenders : సమసమాజ నిర్మాణమే ధ్యేయమనే లక్ష్యంతో ఆయుధాలు పట్టి అడవుల్లో పోరాడుతున్న మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.  తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టులకు రివార్డులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటికి చెందిన వారని తెలిపారు. తెలంగాణ పోలీసులు కల్పించిన అవహాగాహనతో వీరంతా తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 250 మంది మావోయిస్టులు లొంగిపోతే వారిలో 90 శాతం మంది ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని చెప్పారు. వారందరూ ఇక మీదట మావోయిస్టులకు సహకరించమని తేల్చి చెప్పారన్నారు. వారికి అందజేసిన రివార్డులతో స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఇక ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో తెలంగాణ పోలీసుల ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ కూంబింగ్ ఛత్తీస్ గఢ్, కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ అన్నారు. ఈ విషయంలో మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదన్నారు. తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రమేయం లేదన్నారు. కర్రెగుట్ట ఘటనలో మావోయిస్టులు ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదని తేల్చి చెప్పారు.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

Advertisment
Advertisment
Advertisment