Rajalingamurthy Murder: అప్పటివరకు అంత్యక్రియలు చేయం.. రాజలింగం మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్!

భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య రాజకీయ రంగు పులుముకుంది. ఈ హత్య బీఆర్ఎస్ నేతల మెడకు చుట్టుకుంటోంది. హత్య వెనుక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని, మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ఈ హత్య జరిగిందని మృతుని భార్య ఆరోపించడం సంచలనంగా మారింది.

New Update
 Rajalingamurthy Murder

Rajalingamurthy Murder

Rajalingamurthy Murder: భూపాలపల్లి(Bhupalpalli)లో నాగవెల్లి రాజలింగమూర్తి హత్య రాజకీయ రంగు పులుముకుంది. ఈ హత్య బీఆర్ఎస్ నేతల(BRS Leaders) మెడకు చుట్టుకుంటోంది. హత్య వెనుక స్థానిక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy) హస్తం ఉందని, మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) ఆదేశాలతోనే ఈ హత్య జరిగిందని మృతుని భార్య ఆరోపించడం సంచలనంగా మారింది. ఓటమితో నైరాశ్యం నిండిన బీఆర్ఎస్ లో కొత్త జోష్ ను నింపడానికి ఒకవైపు బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ వేడుకలకు సిద్ధం అవుతుండగా, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు రాజలింగమూర్తి హత్య బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు.

Also Read: City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!


గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త, మాజీ కౌన్సిలర్ భర్త అయిన నాగవెల్లి రాజలింగమూర్తి కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాడు. ముందుగా జిల్లా కోర్టులో కేసు వేయగా దాన్ని తీసుకోవడానికి కోర్టు నిరాకరిం చింది. అయితే ఆ తరువాత మెజిస్ట్రేట్ ఆదేశాలతో కేసు నమోదైంది. ఈ రోజు హైకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. ఈ క్రమంలోనే నిన్నరాత్రి రాజలింగమూర్తిని కొంతమంది దుండగులు నడిరోడ్డుపై నరికి చంపారు. అయితే దీని వెనుక భూ సంబంధ లావాదేవీలు ఉన్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక నాయకుల జోక్యంతో రాజకీయ రంగు పులుముకుంది.ఐదుగురు వ్యక్తులపై రాజలింగం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్ కుమార్ తెలిపారు.  

Also Read: City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!
 
ఈ హత్యను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రతి విషయంలో అధికార పక్షానికి కొరకరాని కొయ్యగా తయారైన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగ లేదు. రుణమాఫీ, రైతుభరోసా, రేషన్ కార్డులు ఇలా ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ పై ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, తదితరులపై న్యాయపోరాటం చేస్తున్న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికావడంతో కాంగ్రెస్ ఈ అవకాశాన్ని వదులుకో దలుచుకోలేదు.  ఇప్పటికే  ఈఘటనపై తెలంగాణ సీఎం కార్యాలయం(సీఎంవో) ఆరా తీసింది. హత్య కు గల కారణాలపై నిఘా వర్గాల నుంచి సమాచారం కోరింది. దీంతో కీలక వివరాలను అధికారులు సేకరించారు. మేడిగడ్డ బ్యారేజీలో అవకతవకలు జరిగాయని రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేయగా ఈ కేసు వాదిస్తున్న లాయర్ 6 నెలల క్రితం ఆకస్మికంగా మృతిచెందాడు. తాజాా రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు. దీంతో ఈ హత్య కేసును సీబీసీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: America: పనామా హోటల్‌ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!

కేటీఆర్ సూచన మేరకే….మూర్తి భార్య సరళ ఆరోపణ

కాళేశ్వరం భాగమైన మేడిగడ్డ కుంగుబాటుపై నా భర్త న్యాయపోరాటం చేస్తున్నాడు. అలాగే కొంతమంది భూ ఆక్రమణదారులపై పోరాటం చేస్తున్నాడు. ఈరోజు కేసు విచారణ జరుగుతుంది. ఒకవేళ  రాజలింగమూర్తి కేసు గెలిస్తే తమ ఆటలు సాగవనే తన భర్తను హత్య చేశారని భార్య సరళ ఆరోపించింది.  కేటీఆర్ సూచనతోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన అనుచరులు హరిబాబు, సంజీవ్, రవి తదితరులు కలిసి ఈ హత్య చేశారని ఆరోపించింది. మేడిగడ్డ బ్యారేజీ కేసును విత్ డ్రా చేసుకోమని గండ్ర వెంకటరమణారెడ్డి బెదిరించాడు. పదిలక్షలిస్తామని చెప్పాడు. కానీ, తన భర్త న్యాయంకోసం నిలబడ్డందుకే చంపేశారని సరళ ఆరోపిస్తోంది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేంత వరకు అంత్యక్రియలు కూడా చేయమని భార్య సరళ స్పష్టం చేశారు.

Also Read: ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!

నాకేం సంబంధం లేదు

అయితే ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. హత్య నెపం బీఆర్ఎస్, కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు తనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ హత్యపై సీఐడీ, సీబీఐ విచారణ చేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. ఈ హత్య కేవలం భూ తగాదాల వల్ల జరిగిందని స్థానికులు చెబుతున్నారని అలాంటి దీన్ని రాజకీయ హత్యగా చూపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates: 

Cabinet Meeting: నేడే కేబినెట్ భేటీ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.

chandrababu

Also Read: RRB ALP Jobs 2025: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. వీరందరూ అర్హులే?

Also Read: Vivo T4 5G: మరొకటి వచ్చేస్తుంది మావా.. వివోతో మామూలుగా ఉండదు- కొత్త ఫోన్ భలే ఉందిరోయ్!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీయే కమిషనర్‌కు అనుమతి ఇస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read: Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!

Also Read: Layoffs: ఫార్మా రంగంలో కూడా లేఆఫ్స్‌.. రూ.కోటిపైగా వేతనాలు ఉన్నవారు ఔట్

 

  • Apr 15, 2025 11:31 IST

    ప్రవీణ్ కేసులో కీలక అప్డేట్‌

    -- ఏపీ హైకోర్టును ఆశ్రయించిన కేఏ పాల్ 
    -- ప్రవీణ్ మృతిపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ
    -- ప్రవీణ్‌ కేసును CBIకి ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్



  • Apr 15, 2025 08:46 IST

    ట్రంప్‌ సరికొత్త రూల్స్.. పెళ్లైన వారు అమెరికా వెళ్లడం కష్టమే..

    ట్రంప్‌ ప్రభుత్వం పెళ్లైన కొత్త జంటల్లో కూడా కఠిన విధానాన్ని కొనసాగిస్తోంది. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లి చేసుకున్నవారు అక్కడికి రావాలంటే నెలలు కాదు, ఏకంగా ఏళ్లు పట్టే ఛాన్స్ ఏర్పడింది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    USA immigration
    USA immigration

     



  • Apr 15, 2025 06:53 IST

    CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

    హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

    ipl
    CSK VS LSG

     



  • Apr 15, 2025 06:52 IST

    Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!

    ఏపీలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.శ్రీకాకుళం,విజయనగరం,ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

    weather Updates



  • Apr 15, 2025 06:51 IST

    America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!

    విద్యార్థులు, ఉద్యోగులను అమెరికా వెళ్లిపోమని చెబుతుండగా.. మరోవైపు దక్షిణ కొరియా రమ్మని పిలుస్తోంది.టాప్ టైర్ వీసాలను అందుబాటులోకి తెచ్చి.. మూడేళ్లకే అక్కడున్న విదేశీయులకు శాశ్వత నివాసం హోదాను కల్పించబోతుంది.

    VISA
    VISA Photograph: (VISA)

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు