BIG BREAKING: ధరణి సేవలు బంద్‌

ధరణి పోర్టల్ సేవలు బంద్‌ అయ్యాయి. దీనికి సంబంధించి డేటాబేస్‌ వెర్షన్‌ అప్‌గ్రేడ్‌ అవుతోంది. డిసెంబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు ఇది జరగనుంది. దీంతో నాలుగు రోజుల పాటు ధరణి సేవలు అందుబాటులో ఉండవు.

New Update
Dharani2

ధరణి పోర్టల్ సేవలు బంద్‌ అయ్యాయి. దీనికి సంబంధించి డేటాబేస్‌ వెర్షన్‌ అప్‌గ్రేడ్‌ అవుతోంది. డిసెంబర్ 12న (గురువారం) సాయంత్రం  5 గంటల నుంచి ప్రారంభమైన ఈ అప్‌గ్రేడేషన్ 16వ తేదీ (సోమవారం ) ఉదయానికి ముగియనుంది. దీంతో ఈ నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు అందుబాటులో ఉండవు. అప్‌గ్రేడేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ పోర్టల్ సేవలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. 

Also Read: తల దించుకోవాల్సి వస్తోంది.. పార్లమెంటులో నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

గత ప్రభుత్వం ధరణిలో అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందే తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే పోర్టల్‌లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇదిలాఉండగా.. ఇప్పటికే ధరణిలో ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు ప్రతీ దరఖాస్తును కలెక్టర్ మాత్రమే పరిష్కరించాల్సిన పరస్థితి ఉండేది. కానీ ఇకనుంచి తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు కూడా ఈ పెండింగ్ సమస్యలు పరిష్కరించే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. 

Also Read: మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన సీపీ.. ఏడాదిపాటు బాండ్ ఓవర్!

ముందుగా అప్లికేషన్లను తహశీల్దార్‌కు పంపి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయిస్తున్నారు. ఆ తర్వాత దాన్ని ఆర్డీవో మళ్లీ పరిశీలిస్తారు. ఆ తర్వాత విచారణ రిపోర్టును జతచేసి అదనపు కలెక్టర్‌ను నివేదిస్తున్నారు. అయితే తహశీల్దార్, కలెక్టర్‌ అర్జీనీ వారం రోజుల్లోనే పరిష్కరించాలి, ఇక ఆర్డీవో, అదనపు కలెక్టర్లు మూడు రోజుల్లో పరిష్కరించేలా ప్రభుత్వం గడువు ఇచ్చింది. 

Also Read: ట్రంప్‌ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌!

Also Read: మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2,100 ఆర్థిక సాయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment