Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌!

దసరా, బతుకమ్మ పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

New Update
South Central Railway: ఆ రైళ్లు నెల రోజుల పాటు రద్దు!

South Central Railway : దసరా పండుగ సెలవులతో హైదరాబాద్‌ లోని ప్రధాన రైల్వే స్టేషన్లన్ని కూడా ఫుల్‌ రష్‌ గా ఉన్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో కనీసం కాలుపెట్టే చోటు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమయ్యారు. 

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రెడీ అయ్యింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ అధికారులు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే నుంచి 170 రైళ్లు, ఇతర ప్రాంతాల నుంచి  115 రైళ్లు నడపనున్నారని అధికారులు తెలిపారు. మరో 185 రైళ్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రూట్లను కూడా ప్రకటించారు. సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-రాక్సల్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ , సికింద్రాబాద్ – విశాఖపట్నం,సికింద్రాబాద్-సుబేదార్ గంజ్, హైదరాబాద్-గోరఖ్‌పూర్, మహబూబ్‌నగర్-గోరఖ్‌పూర్,  ఉన్నాయి. సికింద్రాబాద్-సంత్రాగచ్చి, సికింద్రాబాద్-కాకినాడ, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-నగర్ సోల్, సికింద్రాబాద్-మడ్లాటౌన్, తిరుపతి-మచిలీపట్నం, తిరుపతి-అకోలా, తిరుపతి-పూర్ణ, తిరుపతి-హిసార్, నాందేడ్-ఈరోడ్, జాల్నా-చాప్రా, తిరుపతి-షిర్డీ తదితర ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Also Read: నవరాత్రుల స్పెషల్‌...భక్తుల కోసం ప్రత్యేక యాప్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

పాడెపై శవం ముందు కొందరు డ్యాన్సులు వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. కానీ ఆడ, మగ అంతా కలిసి శవం ముందు డీజే పాటలకు డ్యాన్సులు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

New Update
video viral.

video viral

సాధారంగా ఎవరైనా చనిపోతే బోరున ఏడుస్తారు. తమతో కలిసి జీవించే ఒక వ్యక్తి ఇకపై ఉండడని తెలిసి ఊరు ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోతారు. బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతారు. ఇంటి నుంచి స్మశానవాటికకు తీసుకెళ్లేంతవరకు ఏడ్చుకుంటూనే పాడెతో వెళ్తారు. 

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

శవం ముందు పెళ్లి డ్యాన్స్

కానీ ఇక్కడ ఓ ఘటన మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. చనిపోయిన ఓ వ్యక్తిని పాడె ఎక్కించి ఊరు ఊరంతా డ్యాన్సులతో హోరెత్తించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వీరేంట్రా ఇలా ఉన్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Also Read :  కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

వీడియో బట్టి.. అది ఒక చిన్న గ్రామంలా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని పాడెక్కించి ఆడ, మగ.. చిన్నా, పెద్దా ఇలా గ్రామస్తులంతా కలిసి డీజే పాటలు పెట్టి తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యలో పాడెను ఆపి.. డీజే పాటలకు డ్యాన్సులు వేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఒక పక్క మహిళలు, మరో పక్క పురుషులు డ్యాన్సులు వేస్తున్నారు. వారి వెనుక పాడెపై మృతదేహం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక డ్యాన్సులు చేస్తున్న వారంతా.. నవ్వుకుంటూ.. చాలా సరదాగా.. సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

Advertisment
Advertisment
Advertisment