TS: 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు

డీఎస్సీ 2008 బాధితులకు కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్దతిలో పని చేసేందుకు తమ అంగీకార పత్రం ఇచ్చిన వారిని విధుల్లోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. 

New Update
TS TET : మే 20 న తెలంగాణ టెట్‌... పరీక్ష నిబంధనలు ఎలా ఉన్నాయంటే!

డీఎస్సీ 2008 బాధిత అభ్యర్ధులకు ఎట్టకేలకు విముక్తి లభించింది.  కాంట్రాక్ టీచర్ ఉద్యోగాలను డీఎస్సీ-2008 అభ్యర్థులను ఇవ్వాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా 2008 డీఎస్సీలో నష్టపోయిన 1382 మందికి సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ పద్ధతిలో పని చేసేందుకు అంగీకారం పత్రం సమర్పించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.  కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగంలో జాయిన్ అయినవారిని ప్రతీ విద్య సంవత్సర్ రెన్యువల్ చేస్తామని తెలిపింది.   

అభ్యర్థులు హైదరాబాద్‌ మినహా ఇతర జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. ఇందులో భాగంగా డీఈడీ ఉన్న వారికి 30 శాతం ఎస్‌జీటీ పోస్టులు కేటాయించింది. దీనికి సబంధించి 30 శాతం రిజర్వేషన్‌ వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన జరిగిపోయింది. ఇక కాంట్రాక్టు టీచర్లుగా జాయిన్ వారికి నెలకు రూ. 31, 040 జీతం చెల్లించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఇప్పటికే మెరిట్  లిస్ట్ ను తయారు చేశారు.  ఇప్పుడు వారికి హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో కౌన్సిలింగ్‌ నిర్వహించి, నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. 

16 ఏళ్ళుగా ఎదురు చూపులు...

2008లో అప్పటి ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని పేర్కొంటూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆతర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30% డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చట్ట విరుద్ధమని బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ ప్రకారమే ఫలితాలు విడుదల చేసి.. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించింది. డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, 30% కోటా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది.  అప్పటి నుంచి అభ్యర్థులు 14 ఏళ్ళుగా కోర్టులు, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని గత ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Also read :  వల్లభనేని వంశీ అరెస్ట్‌..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు