Jaggareddy రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పిన జగ్గారెడ్డి!

రాహుల్ గాంధీ కులం, మతంపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై  తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని.. వాళ్లది హిందూ మతమని తెలిపారు. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు.  

New Update
jagga reddy rahul

లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కులం, మతంపై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై  తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని.. వాళ్లది హిందూ మతమని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక గాంధీ కుటుంబం కులమతాలను వదిలేసిందని,  ఏ రోజు కూడా రాజకీయాల కోసం కులమతాలను వాడుకోలేదని చెప్పారు.  రాహుల్ గాంధీ కుటుంబంపై ఎవరికీ అవగాహన లేదని.. బండి సంజయ్ తెలిసి మాట్లాడాడో.. తెలియక మాట్లాడాడో అర్థం కావడం లేదన్నారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు.

Also read :  Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా

Also Read :  Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

కులమతాలకు అతీతంగా నెహ్రూ కుటుంబం

తాను రెడ్డి అని, తన భార్య గౌడ్ అని పెళ్లాయ్యాక తన భార్య పేరు నిర్మలా జగ్గారెడ్డిగా మారిందన్నారు జగ్గారెడ్డి.  హిందుమతం ప్రకారం.. భర్త కులమే భార్యకు వర్తిస్తుందని జగ్గారెడ్డి చెప్పారు. రాజీవ్ గాంధీ బ్రాహ్మిణ్ కాబట్టి సోనియా గాంధీది కూడా బ్రాహ్మణ కులం అయిందన్నారు. మోతీలాల్ నెహ్రూ, మహాత్మాగాంధీలు జంజం వేసుకున్నారని చెప్పారు. ఇందిరాగాంధీ భర్త పేరు ఫిరోజ్ గాండి అయితే గాండిని కాస్త గాంధీగా మార్చారని చెప్పారు. ఇంకోసారి రాహుల్ గాంధీ కులం, మతం గురించి మాట్లాడితే బండి సంజయ్ మాటకు విలువ ఉండదన్నారు. బండి సంజయ్ తో పాటుగా బీజేపీ నేతలు విమర్శలు చేసేముందు ఒకసారి హిస్టరీ చెక్ చేసుకోవాలని తెలిపారు జగ్గారెడ్డి. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు.  

Also Read :  Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!

Also Read :  పెయింటర్ కాదు పాపిష్టోడు.. భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం : సంగారెడ్డిలో దారుణం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TS: సలేశ్వరానికి వేలల్లో భక్తులు..శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని సలేశ్వరం జాతన మొదలైంది. దీనికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో శ్రీశైలం హైవే వాహనాలతో నిండిపోయింది. అక్కడ ఆరు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. 

New Update
TS

Srisailam High way

 

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండే సలేశ్వరం బాగా ఫేమస్. ఇక్కడ శివుడిని దర్శించుకోవడానికి భక్తులు విపరీతంగా వస్తారు. ఏడాది ఒకసారి చేసే జాతరకు విశిష్టత ఉండండతో ఈ సమయంలో భక్తులు పోటెత్తుతారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడు కూడా సలేశ్వర్ జాతరకు జనాలు వేలల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. మన్ననూర్‌ చెక్‌పోస్టు వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్‌  చెల్లించే క్రమంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో చెక్‌పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే ట్రాఫిక్ ను వాలంటీర్లు, అటవీశాఖ కంట్రోల్ చేస్తోంది. 

లింగమయ్య స్వామి జాతర..

ప్రతీ యేడూ చైత్ర పోర్ణమి సందర్భంగా సలేశ్వరంలో మూడు రోజుల పాటూ లింగమయ్య స్వామి జాతర జరుగుతుంది. దీనికోసం భక్తులు చాలా దూరం కాలి నడకన వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా కష్టమైన మార్గంలో. అయినా కూడా భక్తులు ఎంతో శ్రద్ధగా, నిష్టగా ఇక్కడకు వెళుతుంటారు. ప్రస్తుతం ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.

 today-latest-news-in-telugu | srisailam | high-way | trafficjam

Also Read: Supreme Court: రాష్ట్రపతి బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
Advertisment