Bodhan Ex MLA Shakil : బ్యాంకుకు రూ.19 కోట్లు ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నేత

Ex MLA Shakil :నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మరో షాక్ తగిలింది. బ్యాంక్‌ నుంచి తీసుకున్న రూ.19 కోట్ల అప్పు సకాలంలో తీర్చలేదని ఎస్బీఐ బ్యాంక్ నోటీసులు జారీ చే'సింది. గడువులోగా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని తెలిపింది.

New Update
Bodhan Ex MLA Shakil

Bodhan Ex MLA Shakil

Bodhan Ex MLA Shakil : వరుస వివాదాలతో వార్తల్లో నిలిస్తోన్న నిజామాబాద్‌(Nizamabad) జిల్లా బోధన్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మరో షాక్ తగిలింది. బ్యాంక్‌ నుంచి తీసుకున్న రూ.19 కోట్ల అప్పు సకాలంలో తీర్చలేదని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు షకీల్‌కు నోటీసులు జారీ చేశారు. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని అధికారులు వార్నింగ్‌ ఇచ్చారు.

 Also Read: అయ్యో బిడ్డలు.. పిల్లలకు ఉరేసి చంపిన తల్లి.. ఆ తర్వాత

రూ.19 కోట్లు ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నేత..

ఇప్పటికే తన కొడుకు హైదరాబాద్‌ ప్రజాభవన్‌(Praja Bhavan) వద్ద చేసిన యాక్సిడెంట్ కేసులో సతమతమవుతున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కు తాజాగా.. బ్యాంక్‌ నోటీసులు రావడం చర్చానీయంశంగా మారింది. గత ఎన్నికల్లో బోధన్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన షకీల్‌ వ్యాపార అవసరాల నిమిత్తం స్టేట్‌బ్యాంక్‌ఆఫ్‌ ఇండియా నుంచి అప్పు తీసుకున్నట్లు తెలిసింది. మొత్తం రూ.19 కోట్ల అప్పు తీసుకోగా ఆ మొత్తాన్ని ఆయన సకాలంలో చెల్లించలేదు. దీంతో ఎస్బీఐ నోటీసులు ఇచ్చింది. కాగా ఈ మొత్తాన్ని చెల్లించడానికి కొత్త గడువును ఇచ్చిన బ్యాంక్‌ ఆ మొత్తాన్ని నియమిత గడువులోగా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని నోటీసులు జారీ చేసింది. కాగా బ్యాంక్‌ అధికారులు జారీ చేసిన  నోటీసులపై ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే షకీల్ నుంచి గాని అలాగే ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి క్లారిటీ, వివరణ రాలేదు. 

Also Read:  72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!

అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ అరెస్ట్‌ అయ్యారు. గత ఏడాది డిసెంబర్‌ 24న జరిగిన పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసులో(Hit and Run Case) ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఘటన అనంతరం రహిల్ అమిర్ దుబాయ్ పారిపోయాడు. రహిల్ హిట్ అండర్ రన్ కేసు అనంతరం.. ఊహించని పరిణామాలు తెరపైకి వచ్చాయి. రహిల్ దేశం దాటడంలో అధికారులు సాయపడినట్టు తేలింది.. ఈ ఘటన అనంతరం పంజాగుట్ట, బోధన్ సీఐలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. షకీల్ కుమారుడు విదేశాలకు పారిపోవడానికి సహకరించారని తేలడంతో వారిని అరెస్టు చేశారు. రహిల్‌కు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

Also Read :  GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!

కొంతకాలం తర్వాత హైదరాబాద్‌ వస్తుండగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో(Shamshabad Airport) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా అతనికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడంతో జైలుకు తరలించారు. అంతకు రెండు సంవత్సరాల ముందు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో షకీల్ కారు ఢీకొనడంతో ఒక చిన్నారి దుర్మరణం చెందిన విషయం విధితమే. ఇప్పటికే ఈ రెండు కేసులతో  షకీల్ సతమతమవుతుండగా తాజాగా బ్యాంక్‌ నోటీసులతో మరోసారి వార్తాల్లో నిలిచాడు.

Also Read :  Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

   

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment