Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం..300 కోళ్లు మృతి.. కోడిగుడ్లు కూడా!

హైదరాబాద్‌లోనూ బర్డ్‌ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ కోళ్ల ఫామ్‌లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. కొత్తగూడెంలోని సాయిగణేశ్ పౌల్ట్రీ ఫౌంలో 200 నుంచి 300 కోళ్లు బర్డ్ ఫ్లూతో మరణిస్తున్నాయని ఫామ్‌ యజమాని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

New Update
Bird Flu

Bird Flu

Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలవరపెడుతోంది. మొన్నటి వరకు ఈ భయం విపరీతంగా వ్యాపించింది. అంతా సద్దుమణిగిందనుకునేలోపే మళ్లీ వైరస్‌ విజృంభిస్తోంది. ఇటీవల ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల బాలిక మృతి చెందినట్టు ICMR ధృవీకరించింది. దీంతో మళ్లీ భయం మొదలైంది. తాజాగా హైదరాబాద్‌లోనూ బర్డ్‌ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ కోళ్ల ఫామ్‌లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. కొత్తగూడెం ప్రాంతంలోని సాయిగణేశ్ పౌల్ట్రీ ఫౌంలో గత నెల 24వ తేదీ నుంచి ప్రతిరోజూ 200 నుంచి 300 కోళ్లు చనిపోతుందడంతో ఫామ్‌ యజమాని రాజశేఖర్‌రెడ్డికి అనుమానం వచ్చింది.

వరుసగా కోళ్లు చనిపోవడంతో..

దీంతో వెటర్నరీ అధికారులను సంప్రదించాడు. అధికారులు అక్కడికి చేరుకుని ఫామ్‌లోని కోళ్ల రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపారు. బెర్హూతో కోళ్లు చనిపోతున్నాయని నివేదిక వచ్చింది. దీంతో చనిపోయిన కోళ్లతో పాటు బతికి ఉన్న కోళ్లను సైతం జేసీఈ సాయంతో ఒక పెద్ద గుంత తీసి పాతిపెట్టారు. ఫామ్‌ యజమాని స్పందిస్తూ వరుసగా కోళ్లు చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపాడు. సంబంధిత వెటర్నరీ అధికారులను వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా స్పందించలేదు.

ఇది కూడా చదవండి: ఎండాకాలం వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది?

ప్రస్తుతం ఫాంలోని కోళ్లతోపాటు కోడిగుడ్లను ఎవ్వరికీ విక్రయించొద్దని నిర్వాహకులకు అధికారులు సూచించారని చెబుతున్నారు. దీంతో మిగతా కోళ్ల ఫామ్‌ల యజమానుల్లో కలవరం మొదలైంది. అటు నగరవాసుల్లో కూడా భయాందోళన నెలకొంది. మరోవైపు అధికారులు మాత్రం భయపడాల్సిందేమీ లేదని, మాంసం బాగా ఉండికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ భయంతో జనాలు కోడి మాంసం తినాలంటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా మటన్‌, చేపల విక్రయాలు భారీగా పెరిగాయి.

ఇది కూడా చదవండి: వేసవిలో దోసకాయ రసం తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

( bird-flu | bird flu case | bird flu effect in telangana latest-news )

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Husband attacks wife : కొండాపూర్ లో దారుణం.. గ‌ర్భిణి అయిన భార్యను చంపాలని...

కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది..గ‌ర్భిణిని చంపేందుకు భ‌ర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. 

New Update
Husband attacks wife

Husband attacks wife

Husband attacks wife : కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది.. గ‌ర్భిణిని చంపేందుకు భ‌ర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైన మహిళ చావుబ‌తుకుల మధ్య ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. 

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!
 
 గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త ఏం జరిగిందో ఏమో గానీ, ఒకసారిగా భార్యమీద దాడి చేశాడు.బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద దాడి చేసిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

పోలీసుల కథనం ప్రకారం… వికారాబాద్‌కు చెందిన ఎండి బస్రత్ (32) బ‌తుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఇంటీరియర్ పనులు చేసుకుంటూ కుటుంబంతో కలిసి హఫీజ్ పేట్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా 2023 జనవరిలో అజ్మీర్ దర్గాకు వెళ్లే క్రమంలో ప్రయాణంలో బస్రత్‌కు కోల్‌క‌తాకు చెందిన షబానా పర్వీన్(22) పరిచయం అయ్యింది. వీరి పరిచయం ప్రేమగా మారగా, 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.వివాహం అనంతరం ఇద్దరు హఫీజ్ పేట్ ఆదిత్యనగర్‌లో కాపురం పెట్టగా, బస్రత్ ఇంటీరియర్ డిజైన్ పనులు చేస్తున్నాడు. పెళ్లి అనంతరం మొదట అత్తామామలతో కలిసి ఉండగా, కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి.

 Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 దీంతో బస్రత్, షబానా పర్వీన్‌లు స్థానికంగా వేరు కాపురం పెట్టారు. ప్రస్తుతం షబానా పర్వీన్ రెండు నెలల గర్భిణి కాగా, మార్చి 29న పర్వీన్‌కు వాంతులు కావడంతో కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని సియా లైఫ్ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తరువాత పర్వీన్‌ను ఏప్రిల్ 1వ తేదీన రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి బయటకు రావడంతోనే, హాస్పిటల్ ముందే భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఇద్దరి మద్య మాటామాటా పెరగడంతో బస్రత్ ఒక్కసారిగా తన భార్య పర్వీన్ మీద దాడికి తెగబడ్డాడు. నడిరోడ్డు మీద పెనుగులాటలో కిందపడిన భార్య మీద అక్కడే ఉన్న బండరాయితో దాడి చేశాడు. దాదాపు 10 నుంచి 12సార్లు రాయితో మోదడంతో పర్వీన్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లింది. చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

ఈ ఘ‌ట‌న‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పర్వీన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా పర్వీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న పర్వీస్ ప్రాణాలతో పోరాడుతుంది. పర్వీన్ కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు నిందితుడు బస్రత్‌ను ఈనెల 3న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

 

 

Advertisment
Advertisment
Advertisment