BREAKING :  బండి సంజయ్‌కు బిగ్‌ షాక్‌...ఢిల్లీకి రావాలంటూ అమిత్ షా ఫోన్‌ ?

గత కొంతకాలంగా తెలంగాణలో హాట్‌ టాఫిక్‌గా మారిన బండి భగీరథ్‌ వివాదం పై బీజేపీ హై కమాండ్‌ సీరియస్‌ అయినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన తండ్రిని వెంటనే ఢిల్లీ రావాలంటూ కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఆర్డర్‌ వేసినట్లు తెలుస్తోంది.

New Update
FotoJet - 2026-05-20T203457.703

Amit Shah calls bandi to come to Delhi?

BREAKING :  గత కొంతకాలంగా తెలంగాణలో హాట్‌ టాఫిక్‌గా మారిన బండి భగీరథ్‌ వివాదం పై బీజేపీ హై కమాండ్‌ సీరియస్‌ అయినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన తండ్రిని వెంటనే ఢిల్లీ రావాలంటూ కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఆర్డర్‌ వేసినట్లు తెలుస్తోంది.  జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం రేపుతున్న ‘బండి భగీరథ్’ వివాదం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసు వ్యవహారం రోజురోజుకూ ముదురుతుండటంతో కేంద్ర నాయకత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగి, బండి సంజయ్‌కి స్వయంగా ఫోన్ చేసి అత్యవసరంగా (అర్జంట్‌గా) ఢిల్లీకి రావాలని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  

అమిత్ షా నుండి పిలుపు వచ్చిన వెంటనే స్పందించిన బండి సంజయ్, గురువారం ఉదయం విమానంలో ఢిల్లీకి బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కొడుకు చుట్టూ ముసురుకున్న ఈ వివాదం, ఆపై పోలీసుల విచారణ, ఎస్ఐటీ (SIT) ఏర్పాటు వంటి పరిణామాలతో బండి సంజయ్‌ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమిత్ షాతో జరిగే ముఖాముఖి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.  
ఈ ఫోన్ కాల్ వెనుక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాత్ర ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో భగీరథ్ ఎపిసోడ్ కారణంగా పార్టీ ప్రతిష్టకు జరుగుతున్న నష్టం, ప్రతిపక్షాల విమర్శలు, ఇక్కడి తాజా రాజకీయ పరిస్థితులపై రాంచందర్ రావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించారు. రాంచందర్ రావు తెలంగాణలోని గ్రౌండ్ రిపోర్టును వివరించిన వెంటనే, అమిత్ షా తీవ్రంగా స్పందించి బండి సంజయ్‌కి లైన్‌లోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భగీరథ్ ఎపిసోడ్‌ను పార్టీ పరంగా గాక, చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధిష్టానం సీరియస్‌గా యోచిస్తోంది.  

మరోవైపు ఈ వ్యవహారాన్ని ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్రీయ సమితి (BRS) పూర్తిగా రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. కేంద్ర హోంశాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న బండి సంజయ్ తన పదవిలో కొనసాగితే, ఆయన కుమారుడిపై జరుగుతున్న విచారణ నిష్పక్షపాతంగా సాగదని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలన్నా, విచారణ సజావుగా సాగాలన్నా బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని బీఆర్‌ఎస్ అధిష్టానాన్ని గట్టిగా డిమాండ్ చేస్తోంది.  ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలో అమిత్ షాతో బండి సంజయ్ జరపబోయే చర్చలు తెలంగాణ బీజేపీ భవిష్యత్తుకు, సంజయ్ రాజకీయ ప్రస్థానానికి అత్యంత కీలకంగా మారనున్నాయి.   

Advertisment
తాజా కథనాలు