Bhu Bharati: భూ భారతి పోర్టల్‌ ప్రారంభం..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్‌ ప్రారంభమయ్యింది. హైదరాబాద్‌లో శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ దీన్ని ప్రారంభించారు. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ పోర్టల్‌ను మూడు మండలాల్లో అమలు చేయనున్నారు.

New Update

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్‌ ప్రారంభమయ్యింది. హైదరాబాద్‌లో శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ దీన్ని ప్రారంభించారు. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ పోర్టల్‌ను మూడు మండలాల్లో అమలు చేయనున్నారు. జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్తాయిలో అమలు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పోర్టల్‌కు సంబంధించి ప్రజల నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించి.. తగిన మార్పులు చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎప్పటికప్పుడు భూభారతి పోర్టల్‌ను అప్‌డేట్‌ చేయనున్నారు. 

Also Read: గ్రూప్‌-1 అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలి: పాడి కౌశిక్ రెడ్డి

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. '' గత ప్రభుత్వం దొరలు, భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్‌ను రూపొందించారు. రైతులకు కంటి మీద నిద్రలేకుండా చేసే చట్టం చేసింది. ధరణి అరాచకాల ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో చూశాము. అందుకే ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు ఉపయోగపడే పోర్టల్‌ను తీసుకొచ్చాం. 

ధరణిని ప్రజలు ఆమోదించలేదు కాబట్టే దాన్ని పక్కన పడేశాం. కలెక్టర్ దగ్గర ఉండే అధికారాలను వికేంద్రీకరణ చేశాం. పలు రాష్ట్రాల్లో భూ చట్టాలను అధ్యయనం చేసి ఉత్తమ చట్టాన్ని రూపొందించాం. హరీశ్‌ రావు వంటి నేతల సూచనలు కూడా స్వీకరించాం. ముసాయిదాను మేధావులు, రైతుల ముందు కూడా పెట్టామన్నామని'' పొంగులేటి అన్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad Crime:Hyderabad: చేపల కూర కోసం యువకుడ్ని హత్య చేసిన స్నేహితులు!

నాగోల్‌లో చేపల కూర కోసం జరిగిన గొడవలో దేవీరామ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ముగ్గురు స్నేహితులు మద్యం సేవించిన అనంతరం కూర విషయంలో వివాదం తలెత్తగా.. ఆగ్రహానికి గురైన ముఖేశ్ కత్తితో దాడి చేయగా..దేవీరామ్ మృతిచెందాడు.

New Update
Fish curry

Fish curry

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకే మనుషులు తాము మనుషులమనే విషయాన్నే మరిచిపోతున్నారు. ఆవేశంలో దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. అటువంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్ నాగోల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చేపల కూర ఓ యువకుడి మృతికి కారణమైంది. అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read: Pahalgam Terror Attack: టెర్రరిస్ట్‌ల దెబ్బకు ఆర్మీని చూసి కూడా బెదిరిపోయిన పర్యాటకులు!

నాగోలు పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ మత్తుగూడ సమీపంలోని కుత్బుల్లాపూర్‌కు చెందిన వెంకటేశ్ యాదవ్ అనే వ్యక్తి వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవీరామ్‌ (24) గత నాలుగేళ్లుగా అక్కడ పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం అతడు తన సొంత రాష్ట్రానికి చెందిన ముఖేశ్ కుమార్, యోగేశ్ కుమార్‌లను కూడా పనికి తీసుకొచ్చాడు. వాటర్ ఫ్లాంట్‌లోనే వారికి పని ఇప్పించాడు.

Also Read: Pahalgam Attack: ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

 అక్కడే ఓ గది ఉండగా అందులోనే ఉంటున్నారు. అయితే ఈనెల 21న రాత్రి ముగ్గురు కలిసి మద్యం సేవించి గదికి చేరుకున్నారు. ముందుగా వచ్చిన దేవీరామ్‌ మిగతావారికి వండిన చేపల కూరను తినేసి, మిగిలినంతను వీధి శునకాలకు వేసాడు.గదికి ఆలస్యంగా వచ్చిన ముఖేశ్, యోగేశ్‌ చేపల కూర ఏదని దేవీరామ్‌ను ప్రశ్నించారు. వారి ప్రశ్నకు దేవీరామ్‌ అహంకారంగా సమాధానమిచ్చాడు. ఈ వివాదం ముదిరి గొడవకు దారి తీసింది. విచక్షణ కోల్పోయిన ముఖేశ్ కుమార్ కూరగాయలు కోసే కత్తితో దేవీరామ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. 

గాయాలతో రోడ్డుపై కుప్పకూలిన దేవీరామ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అతడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. చేపల కూర కోసం హత్య చేయటమేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. 

Also Read: కాశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ వ్యాఖ్యలు..వారం రోజులకు అటాక్..మాకేం సంబంధం లేదంటున్న రక్షణ మంత్రి

Also Read:  Pope Fransis: పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు జరిగేది అప్పుడే.. హాజరుకానున్న ట్రంప్

telangana | hyderabad | nagole | fish curry | latest-news | crime 

Advertisment
Advertisment
Advertisment