TS:ఇప్పటికి 150 కోట్లు..తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న ఏఈఈ అక్రమాస్తులు

రంగారెడ్డి జిల్లాలో నీటిపారుదల శాఖలో పెద్ద తిమింగలం దొరికింది ఏసీబీకి. ఆ శాఖకు చెందిన ఏఈఈ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇతని ఆస్తి దాదాపు రూ.150 కోట్లకు పైనే ఉండొచ్చని అంటున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
ts

పదేళ్ళ సర్వీస్...2013లో ఉద్యోగంలో చేరాడు. కానీ అతని ఆస్తి విలువ మాత్రం 150 కోట్ల పైనే. ప్రభుత్వ ఉద్యోగా మజాకా అంటున్నారు ఇతన్ని చూసి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిఖేశ్‌ బంధువులు, స్నేహితుల ఇళ్ళల్లో మొత్తం 30 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు.  ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఫాంహౌస్‌లతో పాటు భారీగా వ్యవసాయ భూములు, బిల్డింగ్‌లను గుర్తించారు. వీటితో పాటూ రాసుల కొద్దీ బంగారం కూడా దొరికిందని చెబుతున్నారు.  ఇప్పటి వరకు గుర్తించిన ఏఈఈ ఆస్తులు  దాదాపు రూ.150 కోట్లకుపైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

ఆరు నెలల క్రితమే సస్పెండ్..

నిఖేశ్ ఆరు నెలల క్రితం సస్పెండ్ అయ్యారు. తన దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తిని 2 లక్షలు లంచం అడిగారు. దీంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో రంగారెడ్డి జిల్లా ఏఈ నిఖేశ్, ఈఈ బన్సీలాల్‌లు లంచం తీసుకున్నట్టుగా గుర్తించారు. వారిని వెంటనే అప్పుడే సస్పెండ్ చేశారు.

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TS: సలేశ్వరానికి వేలల్లో భక్తులు..శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని సలేశ్వరం జాతన మొదలైంది. దీనికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో శ్రీశైలం హైవే వాహనాలతో నిండిపోయింది. అక్కడ ఆరు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. 

New Update
TS

Srisailam High way

 

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండే సలేశ్వరం బాగా ఫేమస్. ఇక్కడ శివుడిని దర్శించుకోవడానికి భక్తులు విపరీతంగా వస్తారు. ఏడాది ఒకసారి చేసే జాతరకు విశిష్టత ఉండండతో ఈ సమయంలో భక్తులు పోటెత్తుతారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడు కూడా సలేశ్వర్ జాతరకు జనాలు వేలల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. మన్ననూర్‌ చెక్‌పోస్టు వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్‌  చెల్లించే క్రమంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో చెక్‌పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే ట్రాఫిక్ ను వాలంటీర్లు, అటవీశాఖ కంట్రోల్ చేస్తోంది. 

లింగమయ్య స్వామి జాతర..

ప్రతీ యేడూ చైత్ర పోర్ణమి సందర్భంగా సలేశ్వరంలో మూడు రోజుల పాటూ లింగమయ్య స్వామి జాతర జరుగుతుంది. దీనికోసం భక్తులు చాలా దూరం కాలి నడకన వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా కష్టమైన మార్గంలో. అయినా కూడా భక్తులు ఎంతో శ్రద్ధగా, నిష్టగా ఇక్కడకు వెళుతుంటారు. ప్రస్తుతం ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.

 today-latest-news-in-telugu | srisailam | high-way | trafficjam

Also Read: Supreme Court: రాష్ట్రపతి బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
Advertisment