పెండింగ్ బిల్లులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై

పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు బిల్లులను గవర్నర్ పాస్ చేయలేదని తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే తాజాగా మరోసారి పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.నేను ఎవరికి వ్యతిరేకం కాదు, బిల్లులు ఎందుకు తిరస్కరించాననేది కారణాలు మాత్రమే చెప్పానంటూ గవర్నర్ తెలిపారు.గతంలోనే ఈ సమస్య తీవ్రదుమారం రేపింది.మళ్లీ ఈ సమస్య ఎటువైపు తిరగనుందో వేచి చూడాలి.

New Update
పెండింగ్ బిల్లులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై

గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించకపోవడంతో గవర్నర్‌ వర్సెస్‌ తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగా సాగుతోంది. ప్రభుత్వం మొత్తం 10 బిల్లులు ప్రవేశపెడితే మూడింటికి మాత్రమే గవర్నర్ ఆమోదం తెలిపారు. మిగతా రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రభుత్వం పంపగా మరో రెండు బిల్లులపై గవర్నర్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. మిగిలిన మూడు బిల్లుల్లో ఒక బిల్లును రిజెక్ట్ చేశారు. మరో రెండు బిల్లులపై అదనపు వివరణ కోసం తిరిగి ప్రభుత్వానికి పంపించారు.

పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు

telangana-state-hyderabad-telangana-governor-tamilsai-soundar-rajan-on-pending-bills-key-comments

దీంతో గవర్నర్ తీరుపై ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో తాజాగా పెండింగ్ బిల్లులపై గవర్నర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు, బిల్లులు ఎందుకు తిరస్కరించానో కారణాలను మాత్రమే చెప్పానంటూ గవర్నర్ తెలిపారు. బిల్లులను తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు. ప్రభుత్వం కావాలని నన్ను బ్లేమ్‌ చేస్తే నేను బాధ్యురాలిని కాను అన్నారు. నేను రాజకీయమైన యాక్టింగ్ చేయడం లేదు.నేను చెప్పిన కారణాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం అంటూ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేశారు.

త్వరలో వరద ముంపు ప్రాంతాలనూ సందర్శించనున్న గవర్నర్ తమిళిసై

అకాల వర్షాలపై గవర్నర్ స్పందిస్తూ తెలంగాణలో అకాల వర్షాల మూలంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ తనని చాలా బాధ కలిగించాయన్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూస్తుంటే బాదేస్తోందన్నారు. ప్రభుత్వం మరింత మెరుగ్గా ప్రజలకు రక్షణగా ఉండాల్సిందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలని కోరారు. రిమోట్ ఏరియా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలపై కొన్ని రాజకీయ పార్టీలు మెమోరాండం ఇచ్చాయన్నారు. హైదరాబాద్ ఏరియాలో వర్షాల వల్ల చాలా ఎఫెక్ట్ అయిందన్నారు. నీట మునిగిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆదేశించారు. వర్షాలపై ప్రభుత్వాన్ని నివేదిక అడిగానని ఆమె అన్నారు. నివేదిక వచ్చిన వెంటనే కేంద్రానికి పంపుతానని తెలిపారు. త్వరలో వరద ముంపు ప్రాంతాలనూ భాధిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటించనున్నట్లు ప్రకటించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Baisaran Valley: బైసరన్‌ లోయపై అఖిలపక్ష భేటీలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు!

పహల్గాంలోని బైసరన్‌ లోయ ఉగ్రదాడిపై అఖిలపక్ష భేటీలో భద్రతా వైఫల్యంపై తీవ్ర చర్చ జరిగింది. స్థానిక అధికారులు ముందుగా సమాచారం ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపనున్నట్లు వెల్లడించింది.

New Update
Baisaran Valley

Baisaran Valley

Baisaran Valley: జమ్మూ కశ్మీర్‌లోని(Jammu and Kashmir) పహల్గాం(Pahalgam) సమీపంలో ఉన్న బైసరన్‌ లోయలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి(Terror Attack) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో(All Party Meeting)  ఉగ్రదాడి అంశంపై కీలక చర్చలు జరిగాయి. ఈ దాడిపై విపక్షాలు భద్రతా యంత్రాంగ వైఫల్యాన్ని ప్రధానంగా కారణంగా ఎత్తిచూపాయి.

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

దాడి జరిగిన ప్రదేశమైన బైసరన్‌కు పర్యాటకులను అనుమతించిన విషయాన్ని స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు ముందుగా తెలియచేయలేదన్న విషయం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశాన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా తమ కథనాల్లో ప్రస్తావించాయి.

అమర్‌నాథ్‌ యాత్ర(Amarnath Yatra) ప్రారంభమయ్యే జూన్‌ నెల వరకు సాధారణంగా బైసరన్‌ వంటి ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈసారి స్థానిక పాలనా యంత్రాంగం ఎటువంటి సమాచారాన్ని భద్రతా వ్యవస్థలతో పంచుకోకుండా పర్యాటకులకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

విపక్షాల తీవ్ర విమర్శలు..

ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే కనీసం 45 నిమిషాల నడక అవసరం. అలాంటి చోట ఎమర్జెన్సీ పరిస్థితులకు స్పందించే విధంగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ అమల్లో లేకపోవడాన్ని కూడా కేంద్ర ప్రతినిధులు అఖిలపక్ష భేటీలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

విపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దాడి జరిగిన సమయంలో భద్రతా బలగాలు ఎక్కడ ఉన్నాయనే ప్రశ్నలు గట్టిగా లేవనెత్తుతున్నాయి. అలాగే కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ స్పందనపై అనేక ప్రశ్నలు సాధించారని సమాచారం.

"మహారాష్ట్ర ట్రావెల్‌ ఏజెన్సీలు బైసరన్‌ తెరిచిన విషయం తెలుసుకోగలిగితే, భద్రతా సిబ్బందికి అది తెలియకపోవడం ఎలా?" అంటూ మరో ఎంపీ సుప్రియా సూలే(Supriya Sule) అనుమానాన్ని వ్యక్తం చేశారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

పహల్గాం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బైసరన్‌ ప్రాంతాన్ని "మినీ స్విట్జర్లాండ్‌"గా పిలుస్తుంటారు. ఇక్కడి పచ్చని చెట్లు, దట్టమైన అడవులు, అందమైన పర్వత దృశ్యాలు వేసవికాలంలో వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి.

అయితే, ఏప్రిల్‌ 22న ఇక్కడ జరిగిన దారుణం ఎప్పటికీ మరువలేనిది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు, అమాయక పర్యాటకులను చుట్టుముట్టి సమీపం నుంచి కాల్పులకు పాల్పడి 28 మంది ప్రాణాలు హరించారు. ఈ దాడి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

ఈ నేపథ్యంలో భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తగా, అఖిలపక్ష సమావేశం లో వాటిపై తీవ్రమైన చర్చ జరిగింది. కేంద్రం ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు జరిపి, బాధ్యత వహించాల్సిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలుపుతోంది.

Advertisment
Advertisment
Advertisment