T20 World Cup: యూఎస్ మీద గెలిచిన భారత్..సూపర్ 8లోకి ఎంట్రీ

టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా సూపర్ 8 కు చేరుకుంది. యూఎస్‌ మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గి సూపర్ 8లోకి దూసుకెళ్ళింది. అయితే పసికూనల మీద కూడా టీమ్ ఇండియా చెమటోడ్చి నెగ్గడం గమనించాల్సి విషయం.

New Update
T20 World Cup: యూఎస్ మీద గెలిచిన భారత్..సూపర్ 8లోకి ఎంట్రీ

టీ 20 ప్రపంచ కప్‌లో మొదట నుంచి దూకుడుగా ఆడుతున్న టీమ్ ఇండియా మూడో మ్యాచ్‌లో మాత్రం కష్టపడి గెలవాల్సి వచ్చింది. అది కూడా మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళ మీద. గ్రూప్‌ ఏ లో ఈరోజు ఇండియా, యూఎస్‌ఏ టీమ్‌లో తలపడ్డాయి. ఇందులో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మన జట్టు సూపర్ 8కు చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఈ టీమ్‌లో నితీశ్ కుమార్ 27 టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 4, హార్దిక్‌ 2, అక్షర్‌ ఒక వికెట్‌ తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్‌ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్య 50 నాటౌట్ తో అర్ధశతకం చేయగా, దూబె 31 పరుగులతో రాణించాడు. యూఎస్‌ఏ బౌలర్లలో సౌరభ్‌ 2, అలీ ఖాన్‌ ఒక వికెట్‌ తీశారు.

అమెరికాకు పెనాల్టీ..

మరోవైపు ఈ మ్యాచ్‌లో అమెరికా టీమ్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. భారత్‌ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొత్త ఓవర్‌ను ప్రారంభించడానికి మూడుసార్లు యూఎస్‌ఏ 60 సెకన్లు టైమ్ తీసుకుంది. దీనివలన ఓవర్లను పూర్తి చేయడానికి పెట్టిన నిర్ణీత సమయం కాస్త ఎక్కువ అయింది. దీంతో నిబంధనల ప్రకారం అమెరికాకు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. 16వ ఓవర్ ప్రారంభం అయ్యే ముందు ఈ పరుగులను టీమ్ ఇండియా ఖాతాలో కలిపారు.

Also Read:Odisha: ఇది కదా ఆదర్శం అంటే..మాఝీ ప్రమాణస్వీకారానికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....

ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం ఆరా తీశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న  ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

 ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో  దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద  చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత  కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు