IND vs ENG:హిట్ మ్యాన్ బ్యాక్ టూ ఫామ్..మూడో టెస్ట్‌లో సెంచరీ

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మొత్తానికి ఫామ్ లోకి వచ్చాడు. చాలా కాలం తర్వాత టెస్టుల్లో సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

New Update
IND vs ENG:హిట్ మ్యాన్ బ్యాక్ టూ ఫామ్..మూడో టెస్ట్‌లో సెంచరీ
India vs England Rohit Sharma Century :వరల్డ్ కప్ తర్వాత డీలా పడిపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మొత్తానికి మళ్ళీ పుంజుకున్నాడు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో అస్సలు ఏమీ ఆడని రోహిత్ మూడో మ్యాచ్ లో మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. రాజ్‌కోట్‌లో (Rajkot) ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు టీమ్ ఇండియా కెప్టెన్. అయితే మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే మూడు వికెట్లు కోల్పోయింది భారత జట్టు. 33 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తరువాత వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజాలు (Ravindra Jadeja) మాత్రం క్రీజులో పాతుకుపోయారు. రోహిత్ అయితే కీలకమయిన కెప్టెన్ ఇన్నింగ్ ఆడాడు. 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు కోట్టి తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత రోహిత్ టెస్ట్‌ల్లో శతకం సాధించాడు. హిట్ మ్యాన్ కు తోడుగా జడేజా 68 రన్స్‌తో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోరు 190/3 గా ఉంది.

33 పరుగులకే మూడు వికెట్లు...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా (Team India) మొదట్లోనే కుప్పకూలిపోయింది. మొదట రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. రోహిత్ సంయమనంతో ఆడుతలున్న అవతి ఎండ్‌లో మాత్రం వికెట్లు టపటపా పడిపోయాయి. మూడో ఓవర్లోనే యశస్వి జైస్వాల్ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. 10 పరుగులు చేసి మైదాననాన్ని వీడాడు. ఆ తరువాత వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌దీ అదే పరిస్థితి. గిల్ అయితే అసలు కాతా కూడా ఓపెన్ చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇతని తర్వాత మొదటిసారి టెస్టుల్లోకి అరంగ్రేటం చేసిన రజత్ పాటిల్ తన సత్తా చూపించలేకపోయాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హార్లీ బౌలింగ్‌లో.. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజత్‌ అవుటయ్యాడు. దీంతో బారత జట్టు 8 ఓవర్లలో 33 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ తరువాత వచ్చిన జడేజా, క్రీజులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మలు మాత్రం భారత జట్టును ఆదుకున్నారు.

తుదిజట్లు:
టీమిండియా:
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజత్ పాటీదార్‌, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.

Also Read:International:పదేళ్ళ పిల్లను కిరాతకంగా హింసించి చంపిన కేర్ టేకర్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నాల్ నివాసి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ శనివారం (ఏప్రిల్ 26) రూ.50 లక్షల పరిహారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు.

New Update
Vinay Narwal Haryana

Vinay Narwal Haryana

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నాల్ నివాసి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ శనివారం (ఏప్రిల్ 26) రూ.50 లక్షల పరిహారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తల్లిదండ్రుల కోరిక మేరకు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఉగ్రవాదుల పిరికి చర్యను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు.

వివాహం చేసుకున్న ఆరు రోజుల తర్వాత

ఏప్రిల్ 16న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో వివాహం చేసుకున్న ఆరు రోజుల తర్వాత, ఏప్రిల్ 22న (మంగళవారం) పహల్గామ్‌లో ఉగ్రవాదులు చంపిన 26 మంది పర్యాటకులలో వినయ్ నర్వాల్ కూడా ఉన్నాడు. 26 ఏళ్ల అతను తన భార్య హిమాన్షితో హనీమూన్‌కు వెళ్లినప్పుడు ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. అతని అంత్యక్రియలు ఏప్రిల్ 23న (బుధవారం) కర్నాల్‌లో జరిగాయి. 2022లో నేవీలో చేరిన తర్వాత నర్వాల్ గత ఒకటిన్నర సంవత్సరాలుగా కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌లో పనిచేస్తున్నాడు వినయ్ నర్వాల్.

మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా శుక్రవారం కర్నాల్ చేరుకుని వినయ్ నర్వాల్ కు నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం ఆయన కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. పాకిస్తాన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మేము స్వాగతిస్తున్నామని చెప్పిన భూపిందర్ సింగ్ మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు