క్లాస్ రూమ్ లోనే దారుణంగా తన్నుకున్న టీచ‌ర్లు.. వీడియో వైరల్

ఉత్త‌ర కేర‌ళ జిల్లా ఎర‌వ‌న్నూరులోని ఏయూపీ స్కూల్‌లో ఉపాధ్యాయులు తన్నుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఒక చిన్న విషయంలో ఈ గొడవ మొదలవగా క్లాస్ రూమ్ లోనే బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

New Update
క్లాస్ రూమ్ లోనే దారుణంగా తన్నుకున్న టీచ‌ర్లు.. వీడియో వైరల్

పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులే ఈ మధ్య చాలా చెండాలంగా వ్యవహరిస్తున్నారు. పసి బాలలను విచక్షణ రహితంగా కొట్టడంతోపాటు మరికొన్ని చోట్ల బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇదిలావుంటే.. రీసెంట్ గా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఓ చిన్న ఇష్యూలో భాగంగా క్లాస్ రూమ్ లోనే దారుణంగా తన్నుకున్నారు. పిల్లలముందే బూతులు తిట్టుకుంటూ చోక్కాలు చించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక అసలు విషయానికొస్తే.. ఉత్త‌ర కేర‌ళ జిల్లా ఎర‌వ‌న్నూరులోని ఏయూపీ స్కూల్‌లో ఈ దారుణమైన ఘటన జరిగింది. ఎర‌వ‌న్నూరు పాఠశాలలో ఓ మీటింగ్ నిర్వహించారు. అయితే అదే స్కూల్ లో పనిచేస్తున్న భార్య మ‌రో స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న భర్త ఎంపీ షాజీని ఆహ్వానించింది. ఈ క్రమంలో అదే స్కూల్ కు చెందిన ఓ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదును ఎంపీ షాజీ  చైల్డ్‌లైన్‌కు ఫార్వ‌ర్డ్ చేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ విషయం గమనించిన ఆ స్కూల్ టీచర్లు ఎందుకు ఇలా చేశారని మీటింగ్‌లో షాజీ భార్యను నిల‌దీశారు. ఆ స‌మ‌యంలో భార్య‌ను పిక‌ప్ చేసుకునేందుకు స్కూల్‌కు వ‌చ్చిన అత‌ను.. ఆ మీటింగ్‌లో ఉన్న టీచ‌ర్ల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగాడు. దీంతో వాదనలతో మొదలైన గొడ‌వ కొట్టుకునేదాకా వెళ్లింది. ఎంతమంది ఆపిన ఆగకుండా దారుణంగా చొక్కాలు చించుకుని దాడులు చేసుకున్నారు.

Also read : భారత్ లో రెండుచోట్ల భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు

అయితే ఆ ఘ‌ట‌న‌లో ఏడుగురు టీచ‌ర్లకు గాయాలవగా షాజీని బుధ‌వారం పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ 332, 506, 294 సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేసి స్థానిక కోర్టు ముందు అత‌న్ని హాజ‌రుప‌రిచినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ ఘ‌ట‌న టీచ‌ర్లకు చెడ్డ పేరు తీసుకురావడంతో శాఖాప‌ర‌మైన ద‌ర్యాప్తున‌కు అధికారులు ఆదేశించినట్లు చెప్పారు. నిజానికి ఈ ఘ‌ట‌న గ‌త వార‌మే జ‌రిగినా ఆ దాడికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుండగా ఆ టీచర్లను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MURDER: ప్రియురాలే చంపింది.. వీడిన రియల్ ఎస్టేట్ రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ!

ఖమ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ వీడింది. ఏలూరుకు చెందిన ప్రియురాలు (వివాహిత) లావణ్యనే రవిప్రసాద్‌ను బనియన్‌తో గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

New Update

MURDER: ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ వీడింది. ఏలూరుకు చెందిన ప్రియురాలు (వివాహిత) లావణ్యనే రవిప్రసాద్‌ను బనియన్‌తో గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. లావణ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు తెలిపారు. 

అక్రమసంబంధం పెట్టుకోవడంతో..

 ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా రాఘవాపురంకు చెందిన వివాహిత లావణ్య.. తన భర్త భర్త శ్రీనివాసరావుతో కలిసి రవిప్రసాద్‌ కట్టించిన బిల్డింగ్‌లో నివసిస్తోంది. ఈ  క్రమంలోనే కొద్దికాలంగా రవిప్రసాద్‌తో అక్రమసంబంధం పెట్టుకోవడంతో శ్రీనివాస్ వదిలేశాడు. దీంతో ఖమ్మం నేతాజినగర్‌కు మకాం మార్చి రవిప్రసాద్‌తో లావణ్య సహజీవనం చేస్తోంది. అయితే తరుచూ మద్యం సేవిస్తూ లావణ్యను వేధించడం మొదలుపెట్టాడు రవిప్రసాద్‌.

Also Read: రెమ్యునరేషన్‌కు లింగ భేదం ఏంటీ..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా

ఏప్రిల్ 6న లావణ్యతో రవిప్రసాద్ మరోసారి ఘర్షణపడ్డాడు. ఈ వాగ్వాదంలో లావణ్య చేయి కొరికేశాడు. కోపంతో రగిలిపోయిన లావణ్య.. రవిప్రసాద్ బనియన్‌ను మెడకు బిగించగా ఊపిరాడక అక్కడిక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత మద్యం మత్తులో జారిపడగా తల గోడకు తగిలి చనిపోయాడని నమ్మించింది. రవిప్రసాద్ మృతిపై అతని కొడుకు పునీత్ సాయి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణలో రవిప్రసాద్‌ను చంపినట్లు లావణ్య అంగీకరించింది. ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!

khammam | lover | illicit-relationship | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు